Begin typing your search above and press return to search.

ఇండియా - పాక్‌ మ్యాచ్‌ కారణంగా ట్విట్టర్‌ కు సానియా బ్రేక్‌

By:  Tupaki Desk   |   18 Jun 2019 8:58 AM GMT
ఇండియా - పాక్‌ మ్యాచ్‌ కారణంగా ట్విట్టర్‌ కు సానియా బ్రేక్‌
X
ప్రపంచకప్‌ సిరీస్‌ లో భాగంగా మొన్న ఇండియా మరియు పాకిస్తాన్‌ లు తలబడ్డ విషయం తెల్సిందే. ఆ మ్యాచ్‌ లో పాకిస్తాన్‌ జట్టు ఇండియాకు ఏమాత్రం పోటీని ఇవ్వలేక పోయింది. పాకిస్తాన్‌ జట్టు మొన్నటి మ్యాచ్‌ లో ఓడిపోయి తన గత రికార్డును భద్రంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌ ప్రభావం సానియా మీర్జాపై కూడా పడింది. మ్యాచ్‌ కు ముందు రోజు భర్త మరియు మరో పాకిస్తాన్‌ బ్యాట్స్‌ మన్‌ తో కలిసి ఒక రెస్టారెంట్‌ కు సానియా వెళ్లింది.

సానియా మీర్జా భర్త అయిన షోయబ్‌ మాలిక్‌ మొన్నటి మ్యాచ్‌ లో కనీసం ఖాతా కూడా తెరవకుండా ఔట్‌ అయ్యాడు. దాంతో భర్తను మ్యాచ్‌ ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా బయటకు తీసుకు వెళ్లింది. జంక్‌ ఫుడ్‌ తినిపించడం వల్ల అతడు ప్రాక్టీస్‌ కూడా చేయలేక పోయాడు. అందుకే వెంటనే ఔట్‌ అయ్యాడు అంటూ సానియా తీరుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్తాన్‌ నెటిజన్స్‌ దాడికి సానియా గట్టిగానే సమాధానం ఇస్తుంది. అయినా కూడా ఇంకా నెటిజన్స్‌ రెచ్చి పోతూనే ఉన్నారు.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటూ తన కొడుకు ఫొటోలు మరియు ఇతరత్ర విషయాలను షేర్‌ చేసుకుంటూ ఉన్న సానియా మీర్జా ట్రోల్స్‌ ను భరించడం ఇక తన వల్ల కాదని బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. నన్ను విమర్శించే వారు ఇకపై అయినా ఆపేయండి. ఎందుకంటే ఇది బ్రేక్‌ టైం అంటూ తన అకౌంట్‌ లో కొన్ని రోజుల పాటు పోస్ట్‌ లు పెట్టను అన్నట్లుగా చెప్పకనే చెప్పింది. సోషల్‌ మీడియాకు దూరం అయినంత మాత్రాన సానియా మీర్జా విమర్శల నుండి తప్పించుకుంటుందా చూడాలి.