Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరోయిన్లను వదిలేసి సమంత వెంటపడ్డారా?

By:  Tupaki Desk   |   1 Dec 2021 10:03 AM GMT
బాలీవుడ్ హీరోయిన్లను వదిలేసి సమంత వెంటపడ్డారా?
X
తెలుగు .. తమిళ భాషల్లో సమంత స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతోంది. వివాహమైన తరువాత కూడా తన దూకుడును ఎంత మాత్రం తగ్గించని సమంత, విడాకుల తరువాత అదే స్టార్ స్టేటస్ ను కొనసాగించడానికి రంగంలోకి దిగిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలు .. ఐటమ్ సాంగులు .. వెబ్ సిరీస్ లు దేనినీ వదిలేది లేదు అన్నట్టుగా దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఆమె 'పుష్ప' సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఒక స్టిల్ నిన్న సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

ఇక సమంత బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. అక్కడి అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిలిమ్స్ వారు సమంతకి ఒక భారీ ఆఫర్ ఇచ్చారట. తమ బ్యానర్లో మూడు సినిమాలు చేయవలసి ఉంటుందనే డీల్ ను ఆమె ముందుంచారట. అందుకు సమంత అంగీకరించిందని అంటున్నారు. మూడు సినిమాల మీద సమంతకు ముట్టే పారితోషికం భారీస్థాయిలో ఉందని చెప్పుకుంటున్నారు.

అయితే బాలీవుడ్ భామలు ఎంత ఫాస్టుగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. వాళ్లు ఇంత గొప్ప అవకాశాన్ని సమంత వరకూ రానిస్తారా? అనేదే ఒక డౌటు. ఇక పెద్ద బ్యానర్లు ఎప్పుడూ కూడా అన్ని భాషల్లోను దగ్గర దగ్గరగా అదే స్థాయి క్రేజ్ ఉన్నవారికి అలాంటి అవకాశాలను ఇస్తుంటారు. తెలుగు .. తమిళ భాషల్లో సమంతకు మంచి క్రేజ్ ఉంది. ఇక హిందీలో ఆమె చేసింది వెబ్ సిరీస్ మాత్రమే. బాలీవుడ్ సినిమాల పరంగా ఆమె కెరియర్ అక్కడ అ ఆ ల నుంచి మొదలు కావలసిందే. అలాంటిది బాలీవుడ్ ముద్దుగుమ్మలను వదిలేసి సమంతతో మూడు సినిమాల డీల్ కుదుర్చుకుంటారా అనేదే సందేహం.

ఇక తెలుగులో సమంత నుంచి వచ్చే పెద్ద సినిమా ఏదైనా ఉందీ అంటే అది 'శాకుంతలం' మాత్రమే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, శకుంతల - దుష్యంతులకి సంబంధించిన కథతో నిర్మితమైంది. అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ సినిమాను గుణశేఖర్ తీర్చిదిద్దుతున్నాడు. వచ్చే ఏడాదిలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుంది. ఆ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో సమంత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి 'శాకుంతలం' పనులను సైలెంట్ గా చక్కబెడుతున్న గుణశేఖర్ నుంచి ఎప్పుడు ఎనౌన్స్ మెంట్ వస్తుందో చూడాలి.