Begin typing your search above and press return to search.

పూజా పొట్టి డ్రస్‌ వల్ల సల్మాన్ కి ఇబ్బంది

By:  Tupaki Desk   |   28 Feb 2022 11:30 PM GMT
పూజా పొట్టి డ్రస్‌ వల్ల సల్మాన్ కి ఇబ్బంది
X
సౌత్ లో స్టార్‌ హీరోయిన్ అయిన పూజా హెగ్డే బాలీవుడ్‌ లో స్టార్‌ డమ్‌ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ స్టార్‌ హీరోలను తన బుట్టలో పడేసుకునేందుకు ఈ బుట్ట బొమ్మ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ తో ఈ అమ్మడు చేస్తున్న హడావుడి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈమె హిందీ లో ఒక సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన హడావుడి గత కొన్నాళ్లుగా కనిపిస్తూ వస్తుంది.

ఆమద్య ఒక ఇంటర్వ్యూలో సల్మాన్‌ ను చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాను. ఆయన అంటూ ఎంతో అభిమానం.. ఆయన్ను ఒక్కసారి కలిస్తే చాలు అనుకున్న జీవితంకు ఇప్పుడు ఆయన తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఆయనతో కలిసి వర్క్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది.

సల్మాన్ ఖాన్ కూడా పూజా హెగ్డే పై పలు వేదికల మీద ప్రశంసలు కురిపించాడు. చాలా డెడికేషన్‌ తో పూజా హెగ్డే వర్క్‌ చేస్తుందంటూ కామెంట్స్ చేశాడు. ఆమె ప్రతి విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్‌ గా వ్యవహరిస్తుందన్నాడు.

సల్మాన్ ను హీరోయిన్స్ అంత సులభంగా ఇంప్రెస్ చేయలేరు. ఒక వేళ ఆయన ఇంప్రెస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆఫర్లు వరుస కట్టడం ఖాయం. ఇప్పుడు పూజా హెగ్డే కు కూడా అదే జరగబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

తాజాగా సల్మాన్‌ ఖాన్‌ మరియు పూజా హెగ్డేలు ఒక స్టేజ్ పై సందడి చేశారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మరియు పూజా హెగ్డే కలిసి డాన్స్ చేశారు. ఆ డాన్స్ లో భాగంగా పూజా హెగ్డే డ్రస్ ను తన నోట్లో పెట్టుకుని వెనుక నుండి సల్మాన్ డాన్స్ చేయాల్సి ఉంటుంది. కాని సల్మాన్ కు ఆ అవకాశం దక్కలేదు. ఎందుకంటే ఆమె వేసుకున్న డ్రస్ మరీ పొట్టిగా ఉండటంతో పాటు అతడు నోట్లో పెట్టుకునే అవకాశం లేదు.

ఆ మూమెంట్స్ వచ్చిన సమయంలో ఏం చేయాలో తికమక పడ్డ సల్మాన్‌ ఖాన్‌ ఆమె వెనుక నుండి అలా నవ్వుకుంటూ నిలబడి పోయాడు. డాన్స్ స్టెప్పులు వేయలేక సల్మాన్‌ ఖాన్ కాస్త ఇబ్బంది పడ్డాడు అంటూ సల్మాన్ ఖాన్‌ గురించి సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై ఎవరికి వారు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సల్మాన్‌ ఖాన్ మరియు పూజా హెగ్డేల వ్యవహారం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.