Begin typing your search above and press return to search.

మా అమ్మానాన్న నమ్రతకు బాగా తెలుసు

By:  Tupaki Desk   |   15 Jun 2020 11:10 AM GMT
మా అమ్మానాన్న నమ్రతకు బాగా తెలుసు
X
మహేష్‌ బాబు 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహేష్‌ బాబుకు జోడీగా కీర్తి సురేష్‌ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కియారా అద్వానీ హీరోయిన్‌ ను మహేష్‌ కు జోడీగా ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. చివరకు మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ సాయి మంజ్రేకర్‌ ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినట్లుగా ఇటీవల వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఒక బాలీవుడ్‌ మీడియాతో సాయి మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. మహేష్‌ బాబు చిత్రం గురించి తనను సంప్రదించిన విషయమై క్లారిటీ ఇవ్వకుండా ఆ విషయాలు ఏమీ నాకు తెలియదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఇంకా సినిమా కన్ఫర్మ్‌ అవ్వలేదు కనుక ఆమె చెప్పేందుకు నిరాకరించి ఉంటుందని కామెంట్స్‌ వస్తున్నాయి. ఇదే సమయంలో తన తల్లిదండ్రులకు నమ్రత చాలా క్లోజ్‌ గా ఉంటారు అని సాయి మంజ్రేకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సర్కారు వారి పాట సినిమా విషయంలో నమ్రత కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అందుకే హీరోయిన్‌ గా తెలిసిన అమ్మాయి అయిన సాయి మంజ్రేకర్‌ ను ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చి ఉంటారని టాక్‌. బాలీవుడ్‌ లో దబాంగ్‌ 3 చిత్రంతో మెప్పించిన ఈ అమ్మడు మహేష్‌ బాబుకు జోడీగా నటించడం ఖాయం అనే గట్టి వాదన ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.