Begin typing your search above and press return to search.

సైరా కోసం కలం పదును చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   3 Nov 2017 5:38 PM GMT
సైరా కోసం కలం పదును చూపిస్తున్నారు
X
టాలీవుడ్ లో బాహుబలి తర్వాత ఆ స్థాయిలో వస్తోన్న మరో చిత్రం సైరా నరసింహా రెడ్డి. దృశ్య కావ్యం అయినా బాహుబలి ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలిసిందే. కానీ సైరా మూవీ నిజంగా జరిగిన ఒక చరిత్ర. ఊహాజనిత కథకే ప్రేక్షకులు ఒక రేంజ్ బ్రహ్మరథం పట్టారు. మరి తెలుగు గడ్డపై బ్రిటిష్ రాజ్యాలను ఎదిరించిన మొదటి వీరుడి నిజమైన కథకు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారనేది ఎవ్వరు ఒక అంచనాలకు రాలేకపోతున్నారు.

ఇంతటి అద్భుతమైన సినిమాను ఎంత జాగ్రత్తగా తెరకెక్కించాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి అవుట్ ఫుట్ కోసం చిత్ర యూనిట్ ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చిరంజీవి చెప్పే డైలాగులను చెప్పే సీన్స్ ని గూస్బంప్స్ రావడం ఖాయమని తెలుస్తోంది. రైటర్ సాయి మాధవ్ బుర్ర ఈ సినిమా కోసం తన శక్తికి మించిన డైలాగులు రాస్తున్నాడట.

ఇప్పటికే ఆయన రాసిన ఒక డైలాగ్ పరుచూరి గోపాల కృష్ణ గారు చెప్పేశారు. బ్రిటిష్ సామ్రాజ్యాధి నేతలు చుట్టూ ముట్టగా సైరా నరసింహా రెడ్డి చెప్పే డైలాగట అది. "రేయ్.. నేను ఒట్టి చేతులతో వచ్చా.. నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చేయి మీసం మీదకి వెళ్లేసరికి ని బట్టలు తడిచిపోతున్నాయ్ రా.." ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో. ఇంకా ఇలాంటి డైలాగులు చాలానే రాశాడట సాయి మాధవ్ మరి ఆ డైలాగ్స్ ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.