Begin typing your search above and press return to search.

మావ‌య్య‌ల‌తో ఫ్రేమ్ లోకి.. మేన‌ల్లుడి ఎమోష‌న్

By:  Tupaki Desk   |   24 Aug 2021 4:25 AM GMT
మావ‌య్య‌ల‌తో ఫ్రేమ్ లోకి.. మేన‌ల్లుడి ఎమోష‌న్
X
ఆగ‌స్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా సినీరాజ‌కీయ రంగ ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ హీరోలు క‌జిన్స్ అంతా నేరుగా జూబ్లీహిల్స్ లోని చిరు ఇంటికే వెళ్లి విషెస్ తెలిపారు. ఆ రోజు ర‌క్షాబంధ‌న్ కావ‌డంతో చిరంజీవి-ప‌వ‌న్ - నాగ‌బాబు త్ర‌యం మెగాస్టార్ ఇంట్లోనే ఎక్కువ సేపు గ‌డిపారు. అక్క చెల్లెళ్లు అన్న‌ద‌మ్ముల‌తో ఇల్లు క‌ళ‌క‌ళ‌లాడింది.

ఇక మెగా త్ర‌యం ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇంత‌కుముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న వ‌దిన‌మ్మ‌తో స‌ర‌దాగా ఎంతో గొప్ప అనుబంధాన్ని పంచుకున్న వీడియో వైర‌ల్ అయ్యింది. అన్న‌ద‌మ్ములు చిరు-ప‌వ‌న్- నాగ‌బాబు కౌగిలింత‌లు ఆప్యాయ‌త‌ల‌ వీడియో అభిమానుల‌కు గిలిగింత‌లు పెట్టింది. అన్న‌ద‌మ్ముల అనుబంధానికి ప్రతీక మెగా బ్ర‌ద‌ర్స్ అంటూ అంతా సంతోషం వ్య‌క్తం చేశారు. చాలా అరుదుగా మాత్ర‌మే ఈ దృశ్యాలు క‌నిపిస్తాయ‌ని ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు.

అలాగే మెగాస్టార్ నివాసంలో మ‌రో విలువైన ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో మావ‌య్య‌ల‌తో పాటు మెగా మేన‌ల్లుళ్లు క‌నిపించారు. చిరు - పవన్ ఇద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించి కనిపించారు. నాగ బాబు .. మెగా కజిన్స్ - రామ్ చరణ్ - వరుణ్ తేజ్- సాయి తేజ్ అలాగే అతని సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా సాంప్రదాయ దుస్తులలో క‌నిపించారు. ఇక మేన‌ల్లుళ్లు సాయి తేజ్- వైష్ణ‌వ్ తేజ్ ఈ ఫ్రేమ్ ని చూసుకుని ఎంతో మురిసిపోతున్నార‌ట‌. నిజానికి మావ‌య్య‌ల‌కు త‌మ మేన‌ల్లుళ్లు అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆ ఇద్ద‌రి కెరీర్ కోసం చ‌ర‌ణ్ కెరీర్ కంటే ఎక్కువ ఆలోచించి సాయం చేశారు. ఆరంభం స్వ‌యంకృషితో ఎద‌గాల‌ని వారికి సూచించారు. నెమ్మ‌దిగా ఒక్కో అడుగు వేసే క్ర‌మంలో మావ‌య్య‌ల స‌హ‌కారం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సాయి తేజ్ ప్రామిస్సింగ్ హీరోగా ఎదిగారు. వైష్ణ‌వ్ తేజ్ ఆరంభ‌మే ఉప్పెన‌తో రికార్డ్ బ్రేకింగ్ స్టార్ అయ్యాడు. అత‌డి లైన‌ప్ మ‌రో నాలుగేళ్లు వెనుతిరిగి చూడాల్సి ప‌ని లేనంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. అత‌డు వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.

చిరు పుట్టినరోజు వేడుకలు కాకుండా మెగా ఫ్యామిలీ సాంప్రదాయ పద్ధతిలో రక్షా బంధన్ కూడా క‌న్నుల పండువ‌గా సాగింది. మావ‌య్య‌ల‌తో మేన‌ల్లుళ్ల‌ ఛాయాచిత్రాన్ని సాయి తేజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుని మురిసిపోయారు. అప్పటి నుండి ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేరొక ట్వీట్ లో చిరు సాయితేజ్ ని హ‌గ్ చేసుకున్న ఫోటోని షేర్ చేయ‌గా అభిమానుల్లోకి దూసుకెళ్లింది. సాయితేజ్ న‌టించిన రిప‌బ్లిక్ రిలీజ్ కావాల్సి ఉంది. దేవాక‌ట్టా తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌రో ప్ర‌స్థానం రేంజు ఎమోష‌న్స్ తో సాగుతుంద‌ని అంచనా ఉంది. కొల్లేరు స‌ర‌స్సు నేప‌థ్యంలో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రిప‌బ్లిక్ తెర‌కెక్కుతోంది. కోవిడ్ వ‌ల్ల రిలీజ్ ఆల‌స్య‌మైన సంగ‌తి తెలిసిందే.