Begin typing your search above and press return to search.

ఓల్డ్ సిటీ మళ్ళీ తెర పైకి వచ్చింది

By:  Tupaki Desk   |   1 Aug 2017 9:49 AM GMT
ఓల్డ్ సిటీ మళ్ళీ తెర పైకి వచ్చింది
X
హైదరాబాద్ ను పూర్తిగా చూపించాలి అంటే అందులో ఓల్డ్ సిటీ చూపించకుండా పూర్తి చేయలేము. మన తెలుగు సినిమాలు లలో హైదరాబాద్ ని ఒక్కో డైరెక్టర్ ఒక్కో కోణంలో చూపించారు. ఇప్పుడు వస్తున్న సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో కూడా హైదరాబాద్ ని కొత్తగా ఆవిష్కరించే విదంగా నిర్మించారు అని చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ తన మొదటి సినిమా నుండి మాస్ ప్రేక్షకులుకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఈ సినిమాలో కూడా తన చేస్తున్న పాత్ర, కనిపించే తీరు చూస్తే తప్పకుండ మాస్ ప్రేక్షకులును అలరించబోతున్నాడు అనే అనిపిస్తుంది.

సాయి ధరమ్ తేజ్ హీరో గా చేసిన గత కొన్ని సినిమాలు అంతగా ప్రేక్షక ఆదరణ పొందలేదు. తనలో ఎనర్జి తో మాస్ పాత్రలను అవలీలగా చేసేస్తున్న పెద్ద గా లాభం లేకుండా పోయింది. జవాన్ సినిమా టీజర్ లో సాయి ధరమ్ అవతారం కొత్తగా ఉండటం తో పాటుగా తన మాస్ ఇమేజ్ ని పెంచే సినిమాగా మరాబోతుంది అని చెబుతున్నారు. అంతే కాకుండా ఓల్డ్ సిటీ వీదులను అక్కడ వాతావరణంను మళ్ళీ తెరకు కొత్త కనిపించే విదంగా ఉన్నాయి. సిటీ కాలేజీలో కొన్ని షాట్స్ సినిమా ఎలా ఉండబోతుందో చిన్న రుచి చూపించారు. ఇదే ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా షూట్ చేశారు అని తెలుస్తుంది. ఈ 30 సెకండ్లు టీజర్ లో హైదరాబాద్ ని సాయి ధరమ్ పాత్రను పరిచయం చేసే ప్రయత్నం చేసేశారు జవాన్ టీమ్.

ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం చాల కష్టపడి పడినట్లు చెబుతున్నారు. తన కెరియర్ కి ఈ సినిమా ఒక పెద్ద పరీక్షగా తీసుకున్నాడు. ఒక జవాన్ తన దేశభక్తి కి తన కుటంబ ప్రేమ మధ్య జరిగే సంఘర్షణలు ఏ విదంగా ఉంటాయి అనేది ఈ చిత్ర కథ అని తెలుస్తుంది. ఈ సినిమాను బి వి యెస్ రవి డైరెక్ట్ చేస్తున్నాడు. మెహరీన్ కౌర్ ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంటగా నటిస్తుంది. ఆగష్టు నెల లో విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నారట. లెటజీ సీ.