Begin typing your search above and press return to search.

పవన్-త్రివిక్రమ్.. పేమెంట్స్ మొదలయ్యాయ్

By:  Tupaki Desk   |   14 Jun 2016 6:00 AM GMT
పవన్-త్రివిక్రమ్.. పేమెంట్స్ మొదలయ్యాయ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. వీరిద్దరూ ఎంతటి థిక్ ఫ్రెండ్స్ అనే విషయం ఇండస్ట్రీ జనాలకే కాదు.. ఆడియన్స్ కూడా బాగానే తెలుసు. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై కూడా ఎప్పుడూ విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గతంలో జల్సా - అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిస్టరీని కంటిన్యూ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఇందుకు ప్రధాన కారణం.

రీసెంట్ గా అ..ఆ..తో సంచలన విజయం సాధించిన త్రివిక్రమ్.. తన మరుసటి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటివరకూ చాలామంది పేర్లు వినిపించినా.. ఇప్పుడు పవన్ తోనే సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. జులాయి - సన్నాఫ్ సత్యమూర్తి - అ..ఆ..లను నిర్మించిన రాధాకృష్ణ ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. దీంతో రాధాకృష్ణకు త్రివిక్రమ్ తో ఇది వరుసగా నాలుగో చిత్రం అన్నమాట.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌజ్ కి వెళ్లి మరీ.. అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేశారట నిర్మాత. ఫిగర్ విషయంలో అయితే.. 20కోట్లకు కొంచెం ఎక్కువగా పారితోషికం ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే త్రివిక్రమ్ ఇచ్చే మొత్తంపై కూడా ఓ మాట అనేసుకున్నారట. ప్రస్తుతం ఎస్ జే సూర్యతో చేయనున్న సినిమాని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి.. త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత స్పీడ్ గా చేసినా.. పవన్ తో సినిమా అంటే మినిమం వచ్చే ఏడాదిలోనే ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కుతుంది.