Begin typing your search above and press return to search.

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’పై రూమర్.. నిర్మాత బన్నీవాసు ఫైర్

By:  Tupaki Desk   |   14 March 2021 1:16 PM GMT
‘చావు క‌బురు చ‌ల్ల‌గా’పై రూమర్.. నిర్మాత బన్నీవాసు ఫైర్
X
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. బ‌న్నీవాసు, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కాబోతోంది.ఈ సినిమాకు ఇప్ప‌టికే మంచి ప్ర‌చారం ల‌భించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కూడా గ్రాండ్ గా నిర్వ‌హించ‌డంతో మంచి హైప్ వ‌చ్చింది.

ఈ సినిమా రిలీజ్ కు పోటీ కూడా పెద్ద‌గా లేక‌పోవ‌డంతో మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌నే అంచ‌నాలో ఉన్నారు మేక‌ర్స్‌. అయితే.. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ రూమ‌ర్‌ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ అనే చిత్రం రిలీజ్ అయిన తర్వాత రెండు వారాల్లోనే ఓటీటీలో ప్రసారం కానుందని ప్రచారం చేస్తున్నట్టు సమాచారం.

ఈ విష‌యం తెలుసుకున్న సినిమా నిర్మాత బన్నీవాసు ఆగ్రహం వ్యక్తంచేశారని టాక్. ఇదంతా కావాల‌ని చేస్తున్నార‌ని, ఈ వార్తను ఉద్దేశ‌పూర్వ‌కంగానే స్ప్రెడ్ చేస్తున్నార‌ని ఫైర్ అయ్యార‌ట. ఏం జ‌రుగుతోందో త‌న‌కు తెలుస‌ని, ఇలా చేయ‌డం మంచి ప‌ద్ధ‌తి కాద‌ని ఓపెన్ గా వ్యాఖ్యానించార‌ట బ‌న్నీవాసు.