Begin typing your search above and press return to search.
మారుతి కథకు యు/ఎ ఇచ్చారుగా..
By: Tupaki Desk | 24 Jun 2016 1:48 PM GMTదర్శకుడు మారుతి.. ఒక ప్రక్కన ''బాబూ బంగారం'' సినిమాతో బిజీగా ఉంటూనే.. మరో ప్రక్కన మరో కథ ఒకటి రాసేశాడు. దానిని మురళీకృష్ణ అనే నూతన దర్శకుడు సినిమాగా తెరకెక్కించాడు. ఆ సినిమాయే ''రోజులుమారాయి''. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రలైర్ బాగానే ఆకట్టుకుంది.
ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండటంతో.. మనోళ్ళు మాంచి జోష్ మీదున్నారు. అందుకే ఈరోజు సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేయించారట. సినిమాను చూసిన సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. మారుతి రాసిన ఈ కొత్త కథ బాగా ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాను జూలై 1నే విడుదల చేస్తామంటూ ఇప్పటికే నిర్మాతలు మారుతి అండ్ దిల్ రాజు కావల్సినన్ని సంకేతాలు ఇచ్చేశారు.
తెలుగు హీరోయిన్ తేజస్విని మదివాడ.. దృశ్యం పేం కృతిక.. పార్వతీశం అండ్ చేతన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు. మరి 'ఈరోజుల్లో' 'ప్రేమ కథా చిత్రమ్' సినిమాల తరహాలో ఈ సినిమా కూడా హిట్టు కొట్టేస్తుందేమో చూడాలి.
ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండటంతో.. మనోళ్ళు మాంచి జోష్ మీదున్నారు. అందుకే ఈరోజు సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేయించారట. సినిమాను చూసిన సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. మారుతి రాసిన ఈ కొత్త కథ బాగా ఉందంటూ టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాను జూలై 1నే విడుదల చేస్తామంటూ ఇప్పటికే నిర్మాతలు మారుతి అండ్ దిల్ రాజు కావల్సినన్ని సంకేతాలు ఇచ్చేశారు.
తెలుగు హీరోయిన్ తేజస్విని మదివాడ.. దృశ్యం పేం కృతిక.. పార్వతీశం అండ్ చేతన్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా చేస్తున్నారు. మరి 'ఈరోజుల్లో' 'ప్రేమ కథా చిత్రమ్' సినిమాల తరహాలో ఈ సినిమా కూడా హిట్టు కొట్టేస్తుందేమో చూడాలి.