Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు : అన్నీ సుశాంత్ ఫామ్‌ హౌస్‌ లోనే...!

By:  Tupaki Desk   |   15 Sep 2020 2:00 PM GMT
డ్రగ్స్ కేసు : అన్నీ సుశాంత్ ఫామ్‌ హౌస్‌ లోనే...!
X
బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్ ఆత్మహత్య కేసు విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ ని తలపించిన సుశాంత్ సూసైడ్ కేసులో చివరకు డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురు డ్రగ్ పెడ్లర్స్ ని డ్రగ్ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అయితే రియా పెట్టుకున్న బెయిల్ రిక్వెస్ట్ ని కోర్ట్ తిరస్కరించడంతో ప్రస్తుతం 14 రోజుల కస్టడీలో ఉంది. ఈ క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో ఉన్నతాధికారుల విచారణలో రియా కొత్త విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.

డ్రగ్ వ్యహారాలన్నీ ముంబై సమీపంలో సుశాంత్‌‌ కు చెందిన లోనాల్వా ఫామ్‌ హౌస్‌ లో జరిగేవని రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్ ఫామ్‌ హౌస్‌ లో నిర్వహించే డ్రగ్‌ పార్టీలకు బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు యాక్టర్స్ డైరెక్టర్స్ మరియు అతని స్నేహితులు హాజరయ్యేవారని ఆమె చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా డ్రగ్ మాఫియాతో సంబంధాలున్న పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించిన రియా.. బాలీవుడ్ లోని ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ సుశాంత్‌ కి డ్రగ్స్‌ తీసుకోవడం నేర్పించాడని.. తరచూ డ్రగ్స్‌ పార్టీలకు తీసుకువెళ్తుండేవాడని... ఓరోజు సుశాంతే తనకి ఈ విషయాన్ని చెప్పాడని రియా పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సుశాంత్‌ మృతి కేసును డ్రగ్స్‌ కోణంలో విచారిస్తున్న పోలీసులు మహారాష్ట్ర - గోవా ల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. డ్రగ్స్ సరఫరా చేసే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని సమాచారం.