Begin typing your search above and press return to search.

అమ్మాయిలే కాదు.. అమ్మాయిల్లా ఉండే క్రాకర్స్​ అన్నా ఇష్టమే.. ఆర్​జీవీ బోల్డ్​ కామెంట్స్​

By:  Tupaki Desk   |   15 Nov 2020 12:00 PM IST
అమ్మాయిలే కాదు.. అమ్మాయిల్లా ఉండే క్రాకర్స్​ అన్నా ఇష్టమే.. ఆర్​జీవీ బోల్డ్​ కామెంట్స్​
X
సంచలన దర్శకుడు రాంగోపాల్​వర్మ దీపావళి సందర్భంగా పెట్టిన ట్వీట్​ సోషల్​మీడియాను షేక్​ చేస్తున్నది. ప్రతి సారి హిందువుల పండగలు, ఆచారాలపై నెగిటివ్​గా స్పందించే ఆర్​జీవీ ఈ సారి ఏకంగా తన ఆఫీసులో దీపావళి జరుపుకున్నాడు. తన స్టాఫ్​తో కలిసి క్రాకర్స్​ కాల్చి ఎంజాయ్​ చేశాడు. తన ఆఫీసులో చేసుకున్న దీపావళి వేడుకల వీడియోలను ట్విట్టర్​లో షేర్​చేసుకున్నాడు. ‘నాకు అమ్మాయిలంటే ఎంతో ఇష్టం. అలాగే అమ్మాయిల్లా ఉండే దీపావళి టపాసులన్నా ఇష్టమే. నేను అమ్మాయిల కోసం కెమెరా యాంగిల్స్​ వాడుతుంటాను. ఇప్పడు ఈ దివాళి క్రాకర్​ కోసం కూడా వాడాను’ అంటూ ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్ట్​చేశాడు.

మరో ట్వీట్​లో ‘నాకు సెక్స్​ కంటే పవర్​ అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమో ఈ క్రాకర్​ పేల్చుతున్నప్పుడు నా కళ్లల్లోకి చూడండి’ అంటూ మరో వీడియోను పోస్ట్​ చేశాడు. ఆర్జీవీ మొదటిసారి ఇలా దివాళి పండుగకు వీడియోను పోస్ట్​ చేయడంతో అభిమానులు షాక్​ అయ్యారు. ట్విట్టర్​లో విభిన్నమైన రిప్లైలు ఇస్తున్నారు. మరోవైపు ఆర్​జీవీ తన తల్లి సోదరితో కలిసి ఉన్న ఓ ఫోటోను కూడా షేర్​ చేసుకున్నాడు. వాళ్లకు వోడ్కా తాగించేందుకు ట్రై చేశానంటూ కామెంట్​ చేశాడు. ఆర్జీవీ కామెంట్లు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. లాక్​డౌన్​ వేళ దర్శకులంతా ఈగలు తోలుకుంటుంటే ఆర్​జీవీ మాత్రం విభిన్నంగా ఆలోచించి తన మార్కెట్​ను పెంచుకున్నాడు.

వరుసగా రెండు మూడు సినిమాలు ఆన్​లైన్​లో రిలీజ్​చేసి డబ్బులు దండుకున్నాడు. యువతరం దర్శకులంతా ఆర్​జీవిని చూసి చాలా నేర్చుకోవానలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివాదాస్పద సినిమాలు తీయాలన్ని వాటికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవాలన్న ఆర్జీవీ తర్వాతే ఎవరైనా.. ప్రస్తుతం వర్మ దిశ ఘటన ఆధారంగా ‘ దిశ’ అనే చిత్రాన్ని.. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్​ హత్య ఆధారంగా ‘మర్డర్​’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కోర్టు వివాదాలను ఎదుర్కొంటున్నాయి.