Begin typing your search above and press return to search.

గోదావరి తీరాన లెజెండరీ డైరెక్టర్ రెక్కీ.. అందుకోసమేనా..?

By:  Tupaki Desk   |   2 March 2021 4:30 PM GMT
గోదావరి తీరాన లెజెండరీ డైరెక్టర్ రెక్కీ.. అందుకోసమేనా..?
X
లెజెండరీ దర్శకుడు మణిరత్నం ''పొన్నియన్‌ సెల్వన్‌'' అనే పీరియాడికల్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ స్టార్ హీరోలు విక్రమ్ - కార్తీ - జయం రవి - విక్రమ్ ప్రభు.. ఐశ్వర్యారాయ్ - త్రిష - శోభితా ధూళిపాళ్ల తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావంతో చిత్రీక‌ర‌ణ ఆపుకున్న ఈ సినిమాని తిరిగి ప్రారంభించారు. ఇన్నాళ్లు తమిళనాడులో షూటింగ్ చేసిన మణిరత్నం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం రాజమండ్రి పరిసర ప్రాంతలని ఎంచుకునట్లు తెలుస్తోంది.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ గోదావరి అందాల మధ్య ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవచ్చని.. అందులోను పెద్దగా తెలియని ప్రాంతాలకు వెళ్తే ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరత్నం కూడా 'పొన్నియన్ సెల్వన్' సినిమా కోసం రాజమండ్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. పోలవరం మండలం - సింగన్నపల్లి వద్ద ఈ సినిమాకు సంబంధించి షూటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. భారీ సెట్టింగులతో పలు సన్నివేశాలు ఈ ప్రాంతంలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ముందుగానే తన బృందంతో గోదావరి తీరాన మణిరత్నం రెక్కీ చేశారు. చోళుల కాలం నాటి కథాంశంతో రూపొందే సినిమాకి ఈ లొకేషన్స్ సూట్ అవుతాయని భావించి ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. హంస తరహాలో ఓ పడవ సెట్ వేసి అందులో రొమాంటిక్ సన్నివేశాలు మరియు ఓ పాటని షూట్ చేయనున్నట్లు సమాచారం.