Begin typing your search above and press return to search.

కరోనా వల్ల రష్మిక గ్లామర్ పెరిగిందట

By:  Tupaki Desk   |   28 April 2021 3:56 AM GMT
కరోనా వల్ల రష్మిక గ్లామర్ పెరిగిందట
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. అయితే కరోనా నష్టంతో పాటు ఎంతో కొంత లాభం అయితే చేస్తుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో ఒక్కరు ఇద్దరికి లాభం అయితే కలుగుతుంది. ఆ వేలల్లో ఒక్కరిగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా కూడా ఉందట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. రష్మికకు కరోనా వల్ల నష్టం తో పాటు లాభం కూడా చేకూరిందట. ఇటీవల రెగ్యులర్ గా సోషల్‌ మీడియాలో లైవ్ చిట్‌ చాట్ చేస్తున్న రష్మిక మందన్నా మరోసారి ఇన్‌ స్టా గ్రామ్‌ లో అభిమానులతో ముచ్చటించారు.

రష్మిక మందన్నా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సమయంలో మీరు ఎప్పుడైనా డేట్‌ కు వెళ్లారా అంటూ ప్రశ్నించగా అసలు డేట్‌ అంటే ఏంటీ అంటూ ప్రశ్నించింది. అక్కడకు వెళ్లి ఏం చేస్తారు అనేది కూడా నాకు తెలియదు అంది. అయితే అడ్వెంచర్ స్పోర్ట్స్‌ కు వెళ్లడం మాత్రం ఇష్టమని చెప్పుకొచ్చింది. వర్చువల్‌ డేటింగ్ పై కూడా నమ్మకం లేదని చెప్పుకొచ్చింది. డేట్‌ అంటే తెలియకుండానే ప్రేమించావా.. రక్షిత్‌ తో ప్రేమ పెళ్లి నిశ్చితార్థం మొత్తం కూడా డేట్‌ కు వెళ్లకుండానే జరిగిందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కరోనా వల్ల బయటకు వెళ్లడం తగ్గింది. బయటకు వెళ్లక పోవడం వల్ల మేకప్ వేసుకోవడం లేదు. ఫేస్ కు మేకప్ వేసుకోక పోవడం వల్ల ఆటోమేటిక్ గా ఫేస్ గ్లో అనేది పెరిగి గ్లామర్‌ పెరుగుతుందని రష్మిక చెప్పుకొచ్చింది. గ్లామర్‌ పెరిగేందుకు ఇండైరెక్ట్‌ గా కరోనా హెల్ఫ అయ్యిందని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప సినిమా తో పాటు తెలుగు, తమిళం, కన్నడం మరియు హిందీల్లో పలు సినిమాలు చేస్తూ సౌత్ లోనే బిజీ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది.