Begin typing your search above and press return to search.

మేడమ్‌ ను 'మేడమ్‌' అనేది ఆయన ఒక్కడేనట!

By:  Tupaki Desk   |   11 Jun 2022 8:30 AM GMT
మేడమ్‌ ను మేడమ్‌ అనేది ఆయన ఒక్కడేనట!
X
ఛలో మరియు గీత గోవిందం సినిమాలతో హీరోయిన్ గా టాలీవుడ్‌ లో ఒక్కసారిగా స్టార్‌ స్టేటస్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. గీత గోవిందం సినిమా లో హీరోయిన్ రష్మిక మందన్నా ను హీరో విజయ్ దేవరకొండ మేడమ్‌... మేడమ్‌ అంటూ పిలుస్తూ ఉంటాడు. మేడమ్ అంటూ అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.

రష్మిక మందన్నా అభిమానులు ఎంతో అభిమానంగా మేడమ్‌ అంటూ పిలుచుకుంటున్న ఈమెను ఇండస్ట్రీలో ఒకే ఒక్కరు మేడమ్‌ అంటూ పిలుస్తున్నారట. అతడే రణబీర్ కపూర్‌. ప్రస్తుతం వీరిద్దరు కలిసి సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ మొదటి రోజే ఫోటో లీక్ అయ్యింది.

ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. మళ్లీ ఇన్నాళ్లకు రష్మిక స్పందిస్తూ యానిమల్‌ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగుతుందని చెప్పుకొచ్చింది. తాను తెలుగు.. తమిళం.. కన్నడం మరియు హిందీలో పలువురు స్టార్‌ లతో నటించాను. వారందరిలో కేవలం రణబీర్ కపూర్ మాత్రమే తనను మేడమ్ మేడమ్ అంటూ పిలుస్తూ ఉంటాడని చెప్పుకొచ్చింది.

రణబీర్ కపూర్‌ తో వర్క్ చేసే అవకాశం వచ్చిన సమయంలో చాలా టెన్షన్‌ పడ్డాను. ఆయనతో చేసే సమయంలో ఎలా ఉంటుందో అని ఆందోళన చెందాను. కాని ఆయనతో వర్క్ చేస్తున్న సమయంలో ఎంతో జోవియల్‌ గా ఉన్నారు. ఒక సూపర్‌ స్టార్‌ ను అనే విషయాన్ని ఆయన ఎప్పుడు కూడా చూపించే విధంగా ఇతరుల వద్ద ప్రవర్తించడు.

ఆయనతో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా కంఫర్ట్‌ గా ఉండవచ్చు. ప్రతి విషయంలో కూడా చాలా క్లీయర్ గా ఆయన ఉంటాడు. అందువల్లే ఆయనతో సినిమాలో నటించే సమయంలో చాలా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

మరో వైపు రష్మిక మందన్నా పుష్ప 2 సినిమా కోసం వెయిట్‌ చేస్తోంది. ఆ సినిమా ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు సుకుమార్‌ సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ స్టార్‌ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా రష్మిక నటిస్తున్న విషయం తెల్సిందే.