Begin typing your search above and press return to search.

#RC16 : బాలీవుడ్‌ బ్యూటీ కాదు మన శ్రీవల్లినే!

By:  Tupaki Desk   |   5 Feb 2022 8:30 AM GMT
#RC16 : బాలీవుడ్‌ బ్యూటీ కాదు మన శ్రీవల్లినే!
X
రామ్‌ చరణ్‌ నటించిన ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా కోసం దాదాపుగా మూడు సంవత్సరాలకు పైగా సమయం కేటాయించిన రామ్‌ చరణ్ ఇకపై ఎలాంటి బ్రేక్ లేకుండా.. ఆలస్యం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒక వైపు తన తండ్రి చిరంజీవి ఒకే సారి నాలుగు అయిదు సినిమాలకు కమిట్ అయ్యాడు. కనుక తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేందుకు చరణ్‌ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమా విడుదల కాబోతున్నట్లుగా చెబుతున్నారు. షూటింగ్ చకచక పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. శంకర్ సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే యూవీ క్రియేషన్స్‌ వారు రామ్‌ చరణ్‌ 16వ సినిమా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో అంటూ అధికారికంగా ప్రకటించారు. వంశీ మరియు ప్రమోద్ లు చరణ్ కు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. అందుకే యూవీ క్రియేషన్స్‌ లో నటించేందుకు చరణ్‌ సిద్దం అయ్యాడు. గౌతమ్‌ తిన్ననూరి ఒక మంచి సబ్జెక్ట్‌ తో ఈ సినిమాను చేయబోతున్నాడు. జాతీయ అవార్డు స్థాయి సినిమా జెర్సీ ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ప్రస్తుతం అదే సినిమా ను బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్న ఈ దర్శకుడు అంతకు మించిన కథలో చరణ్ ను చూపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. రామ్‌ చరణ్‌ కు జోడీగా ఈ సినిమాలో మొదట బాలీవుడ్‌ బ్యూటీ అనుకున్నారు. ఇప్పటికే దిశా పటానీ పేరు ప్రముఖంగా వినిపించింది. కాని ఇప్పుడు రామ్‌ చరణ్ కు జోడీగా దిశా పటానీ ని కాకుండా మన సౌత్ స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్నా ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

పుష్ప సినిమాతో రష్మిక మందన్నా స్థాయి అమాంతం పెరిగింది. సౌత్ లో స్టార్‌ హీరోయిన్ గా ఇప్పటికే నిరూపించుకున్న రష్మిక పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రతో అక్కడ జనాలకు మరింత చేరువ అయ్యింది. అంతే కాకుండా ప్రస్తుతం రెండు బాలీవుడ్‌ సినిమాలను కూడా ఈ అమ్మడు చేసింది. కనుక రష్మిక మందన్నా అయితే పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాకు బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో గౌతమ్ తిన్ననూరి అండ్ టీమ్‌ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్‌ గా రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది. ఈ సమయంలో రామ్‌ చరణ్ కు జోడీగా ఆమె నటిస్తే ఆమె క్రేజ్ మరో లెవల్‌ కి వెళ్లడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. రామ్‌ చరణ్.. గౌతమ్ తిన్ననూరి ల కాంబో మూవీ హీరోయిన్ విషయమై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.