Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మకు అక్కడ కూడా పోటీగా మారిన లక్కీ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   17 March 2021 7:30 AM GMT
బుట్టబొమ్మకు అక్కడ కూడా పోటీగా మారిన లక్కీ బ్యూటీ..!
X
టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్ర కథానాయికలు పూజాహెగ్డే మరియు రష్మిక మందన్నా హవా నడుస్తోంది. వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ టూ బాలీవుడ్ అంటూ అక్కడ కూడా అడుగుపెట్టారు. అయితే తెలుగులో పూజాకి పోటీనిస్తూ వచ్చిన రష్మిక.. హిందీలో కూడా బుట్టబొమ్మకి పోటీగా మారుతోందని తెలుస్తోంది.

పూజా హెగ్డే ప్ర‌స్తుతం తెలుగులో 'రాధేశ్యామ్' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలతో పాటు 'ఆచార్య'లో కనిపించనుంది. ఇక బాలీవుడ్ లో య‌శ్ రాజ్ ఫిలిమ్స్ వారితో మూడు సినిమాలకు పూజా అగ్రిమెంట్ వేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రణవీర్ సింగ్ - డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సర్కస్' సినిమాలో పూజాని హీరోయిన్ గా తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలానే సల్మాన్ ఖాన్ తో 'కభీ ఈద్ కభీ దివాళీ' అనే సినిమాలో నటించనుంది.

అలానే రష్మిక మందన్న కూడా య‌శ్ రాజ్ ఫిల్మ్స్ వారితో మూడు సినిమాలు చేయనుందని.. ఇప్పటికే వీటికి సంబంధించిన అగ్రీమెంట్స్ కూడా అయిపోయాయని బీ టౌన్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇకపోతే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న 'మిష‌న్ మ‌జ్ను' సినిమాలో లక్కీ బ్యూటీ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇదే క్రమంలో వికాస్ భల్ దర్శకత్వంలో అమితాబ్ నటిస్తున్న 'డెడ్లీ' అనే సినిమాలో కూడా రష్మిక ఓ కీలక పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

ఇలా టాలీవుడ్ లో పోటీపడుతున్న ఈ బ్యూటీస్ బాలీవుడ్ లో కూడా పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలని కూడా పోటాపోటీగా సెలెక్ట్ చేసుకొని హిందీలో క్రేజ్ తెచ్చుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నార‌ని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.