Begin typing your search above and press return to search.
అంతా చెడునే చూస్తారా.. బెల్లం శ్రీదేవి ఫైరింగ్!
By: Tupaki Desk | 6 Dec 2019 7:27 AM GMT``మంచి చెబితే ఎవరికీ ఎక్కదు.. చెడుని మాత్రం ముందే వంట బట్టించుకుంటారు. అది మాత్రమే కనిపిస్తుంది. మంచి ఎక్కదు.. ప్రతీ చెడ్డ విషయాన్ని సినిమాకు ముడిపెట్టడం మంచిది కాదు. సినిమాల ద్వారా చెప్పే మంచిని కూడా చూడండి.. గ్రహించండి..`` అంటూ మండి పడుతోంది బెల్లం శ్రీదేవి ఉరాఫ్ రాశీ ఖన్నా. తెలుగులో కథానాయికగా వరుస చిత్రాల్లో నటిస్తున్న రాశీ ఈ డిసెంబర్ రేసులో రెండు చిత్రాలతో బరిలోకి దిగుతోంది.
బాబి దర్శకత్వంలో మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్- నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `వెంకీమామ`తో పాటు సాయి తేజ్ హీరోగా మారుతి రూపొందిస్తున్న `ప్రతిరోజు పండగే` చిత్రాల్లో నటిస్తోంది రాశి. ఈ రెండు చిత్రాల్లో `వెంకీమామ` ఈ నెల 13న రిలీజ్ కానుండగా.. `ప్రతీరోజు పండగే` ఇదే నెల చివరి వారంలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన రాశీ సమాజం.. సినిమా వల్ల చెడిపోవడం లేదని చెప్పుకొచ్చింది.
ప్రతి విషయానికి సినిమాల్ని నిందించడం మంచిది కాదని.. సినిమాల్లో ఇది తప్పు..ఇది ఒప్పు అని చెప్పడానికి ప్రమాణాలు అంటూ ఏమీ వుండవని.. అది చూసే దృష్టి కోణాన్ని బట్టి వుంటుందని చెప్పుకొచ్చింది. స్క్రిన్షో చేస్తే కొంత మందికి తప్పుగా అనిపించొచ్చు.. మరికొంత మందికి ఒప్పుగా అనిపించొచ్చు. సినిమాల్లో చెడే కాదు మంచీ చూపిస్తున్నారు. చెబుతున్నారు. దాన్ని వదిలేసి చెడును మాత్రమే తీసుకుంటే ఎలా అని ఫైరవుతోంది. వెంకీమామలో చైతన్య మరదలుగా నటిస్తున్న రాశీ ఖన్నా.. ప్రతిరోజూ పండగే చిత్రంలో సాయి తేజ్ ప్రేమికురాలిగా.. టిక్ టాక్ అడిక్షన్ ఉన్న అమ్మాయిగా నటిస్తోంది. రాశీ విజువల్స్ కి బోయ్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
బాబి దర్శకత్వంలో మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్- నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `వెంకీమామ`తో పాటు సాయి తేజ్ హీరోగా మారుతి రూపొందిస్తున్న `ప్రతిరోజు పండగే` చిత్రాల్లో నటిస్తోంది రాశి. ఈ రెండు చిత్రాల్లో `వెంకీమామ` ఈ నెల 13న రిలీజ్ కానుండగా.. `ప్రతీరోజు పండగే` ఇదే నెల చివరి వారంలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన రాశీ సమాజం.. సినిమా వల్ల చెడిపోవడం లేదని చెప్పుకొచ్చింది.
ప్రతి విషయానికి సినిమాల్ని నిందించడం మంచిది కాదని.. సినిమాల్లో ఇది తప్పు..ఇది ఒప్పు అని చెప్పడానికి ప్రమాణాలు అంటూ ఏమీ వుండవని.. అది చూసే దృష్టి కోణాన్ని బట్టి వుంటుందని చెప్పుకొచ్చింది. స్క్రిన్షో చేస్తే కొంత మందికి తప్పుగా అనిపించొచ్చు.. మరికొంత మందికి ఒప్పుగా అనిపించొచ్చు. సినిమాల్లో చెడే కాదు మంచీ చూపిస్తున్నారు. చెబుతున్నారు. దాన్ని వదిలేసి చెడును మాత్రమే తీసుకుంటే ఎలా అని ఫైరవుతోంది. వెంకీమామలో చైతన్య మరదలుగా నటిస్తున్న రాశీ ఖన్నా.. ప్రతిరోజూ పండగే చిత్రంలో సాయి తేజ్ ప్రేమికురాలిగా.. టిక్ టాక్ అడిక్షన్ ఉన్న అమ్మాయిగా నటిస్తోంది. రాశీ విజువల్స్ కి బోయ్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.