Begin typing your search above and press return to search.

సీక్రెట్ గా జోధ్ పూర్ అడ‌వుల్లో చిక్కిన ప్రేమ గువ్వ‌లు!

By:  Tupaki Desk   |   27 Sept 2021 10:11 PM IST
సీక్రెట్ గా జోధ్ పూర్ అడ‌వుల్లో చిక్కిన ప్రేమ గువ్వ‌లు!
X
తన 39వ పుట్టినరోజు వేడుక‌ల్లో భాగంగా రణబీర్ కపూర్ త‌న ప్రియురాలు అలియా భట్ తో క‌లిసి జోధ్ పూర్ అడ‌వుల్లో షికార్ చేయ‌డం కంట ప‌డింది. నగరానికి చెందిన ఛాయాచిత్రకారులు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఈ జంట విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న ఫోటోలను పంచుకున్నారు.

ఆలియా క్రాప్ టాప్ తో ఒక జత జీన్స్ ధరించింది. ఆమె ఆకుపచ్చ - తెలుపు జాకెట్ ధ‌రించి సన్ గ్లాసెస్ తో అద్భుతంగా క‌నిపిస్తోంది. రణబీర్ మాత్రం మొత్తం బుర్గుండి దుస్తులను ఎంచుకున్నాడు.

సెప్టెంబర్ 28 మంగళవారం నాటికి రణబీర్ ఒక సంవత్సరం పెద్దవాడవుతాడు. గత సంవత్సర, అతను తన పుట్టినరోజును తన తల్లి నీతూ కపూర్- సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని - ఆలియాతో గడిపాడు. అతను నీతూ .. రిద్ధిమాతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోని ఆలియా పోస్ట్ చేసింది. రెండు పుట్టినరోజు కేక్ లతో పోజులిచ్చారు ర‌ణ‌బీర్.

గత సంవత్సరం మహమ్మారి లేకపోతే తాను ఆలియా వివాహం చేసుకునేవాళ్ల‌మ‌ని రణబీర్ వెల్లడించాడు. మాజీ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ తో రణ్‌బీర్ మాట్లాడుతూ.. “మహమ్మారి మన జీవితాలను తాకకపోతే ఈపాటికే పెళ్లి అయ్యేది. కానీ నేను ఏదో ఒక‌టి చెప్పడం ద్వారా హ‌డావుడి చేయ‌ను. నా జీవితంలో త్వరలో ఆ లక్ష్యాన్ని గుర్తించాలనుకుంటున్నాను`` అని అన్నారు.

అలియా - రణబీర్ గత మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర చిత్రంలో కనిపించనున్న వీరిద్దరూ తరచూ ఒకరి కుటుంబాలతో ఒక‌రు గడపడం కనిపిస్తుంది. ఇటీవల రణబీర్ తన తండ్రి.. చిత్రనిర్మాత మహేష్ భట్ పుట్టినరోజును జరుపుకోవడానికి అలియాతో కలిశాడు.