Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌టికొచ్చేసిన రానా..?

By:  Tupaki Desk   |   19 Dec 2020 4:00 PM GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌టికొచ్చేసిన రానా..?
X
మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. అధికారికంగా ప్రకటించినప్పటికీ మరో హీరోగా దగ్గుబాటి రానా కోసం మేకర్స్ ప్రయత్నాలు చేశారు. బిజూ మీనన్ పోషించిన నిజాయితీగల పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో పవన్‌ కనిపించనుండగా.. అతనికి ధీటుగా నిలిచే పృథ్వీరాజ్ నటించిన పాత్రలో రానా కనిపించాల్సి ఉంది. అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రానా ఈ రీమేక్ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌టికొచ్చేసాడని తెలుస్తోంది.

'అయ్యప్పనమ్ కోషియమ్' సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలు ఈక్వల్ గా బ్యాలెన్సుడుగా ఉంటాయి. మలయాళ వర్షన్ సూపర్ హిట్ అవడానికి ప్రధాన కారణం ఇద్దరు హీరోల రోల్స్ అనే చెప్పాలి. అయితే తెలుగు వర్షన్ లో చేస్తున్న మార్పులు చేర్పుల ప్రకారం పవన్ ని హైలైట్ చేస్తూ రానా చేయ‌బోయే రోల్ కాస్త త‌గ్గించారట. ఇది అంతగా రుచించ‌ని రానా ఈ రోల్ నుంచి బ‌య‌టికొచ్చేసిన‌ట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మేకర్స్ ఈ పాత్ర‌కు ఓ హీరోని వెతికే పనిలో ఉన్నారట. అయితే కుర్ర హీరోలెవ‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఫైటింగ్ చేసే సీన్లు ఉన్నాయ‌ని ఇందులో నటించడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. దీంతో ఎవ‌రైనా ఇతర ఇండస్ట్రీ హీరోని ఇందులోకి తీసుకోవడానికి ప్ర‌య‌త్నిస్తున్నారట. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.