Begin typing your search above and press return to search.

హాస్యబ్రహ్మకు రామినేని విశేష పురష్కారం

By:  Tupaki Desk   |   7 Nov 2021 1:30 AM GMT
హాస్యబ్రహ్మకు రామినేని విశేష పురష్కారం
X
ప్రతి ఏడాది వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గాను డాక్టర్ రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పురష్కారాలు అందిస్తున్నారు. 2021 సంవత్సరానికి గాను ఫౌండేషన్‌ నిర్వాహకులు పురష్కాలను ప్రకటించారు. విషిష్ట పురష్కారం మరియు విశేష పురష్కారం అని రెండు పురష్కారాలను ఫౌండేషన్ నిర్వాహకులు ఇస్తున్నారు. విషిష్ట పురష్కారంను డాక్టర్ కృష్ణ ఎల్లా మరియు సుచిత్ర ఎల్లకు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. భారత్‌ బయోటెక్ సీఎండీ అయిన కృష్ణ ఎల్లా కరోనా వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ అవసరం ఉన్న ఈ సమయంలో ఆయన తన సంస్థ నుండి ఆ వ్యాక్సిన్ ను ఇవ్వడం జరిగింది. ఇక సుచిత్ర ఎల్లా జేఎండీగా భారత్‌ బయోటెక్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు ఈ పురష్కారం దక్కింది. విశేష పురస్కారంను డాక్టర్ రామినేని ఫౌండేషన్ వారు బ్రహ్మానందంకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఈ విశేష పురష్కారంను డాక్టర్‌ దుర్గ పద్మజ మరియు శ్రీ ఎస్వీ రామా రావు కు కూడా అందించారు. నిమ్స్‌ లో ప్రొఫెసర్ అయిన దుర్గ పద్మజ ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఎస్వీ రామరావు గారు తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. ఆయన ఎన్నో రచనాలు కూడా చేశారు.

ఈ అయిదుగురు ప్రముఖులకు గాను 2021 డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురష్కారాలు అందబోతున్నాయి. సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యయనంను క్రియేట్‌ చేసుకున్న బ్రహ్మానందం ఈ మద్య కాలంలో కాస్త సినిమాలు తగ్గాయి. ఆయన కామెడీ టైమింగ్‌ ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమాతో నిరూపితం అయ్యింది. బ్రహ్మానందం ఉంటే కామెడీ పక్కాగా ఉంటుంది. కాని ఈమద్య కొత్త దర్శకులు ఆయన కోసం పాత్రలను క్రియేట్ చేయడంలో అంతగా సఫలం కాలేక పోతున్నారు.