Begin typing your search above and press return to search.

బోయపాటి తో ఉస్తాద్ హీరో బైలింగ్వల్ మూవీ..?

By:  Tupaki Desk   |   30 Aug 2021 5:20 AM GMT
బోయపాటి తో ఉస్తాద్ హీరో బైలింగ్వల్ మూవీ..?
X
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం విపరీతమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా.. రామ్ ను ఉస్తాద్ గా మార్చేసింది. డబ్బింగ్ చిత్రాలతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రాపో.. ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇస్మార్ట్ సక్సెస్ తర్వాత రామ్ నటించిన 'రెడ్‌' చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ డ్యూయల్ రోల్‌ ప్లే చేసిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. మాస్ హీరోగా మంచి పేరరే తెచ్చిపెట్టింది. దీంతో ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామి తో కంప్లీట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ క్రమంలో యువ హీరో మరో మాస్ మసాలా మూవీకి సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పొతినేని ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుందని.. #RAPO19 తర్వాత రామ్ చేసే ప్రాజెక్ట్ ఇదేనని అంటున్నారు. బోయపాటి చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ - ఎమోషనల్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు రామ్ కోసం బోయపాటి ఒక పవర్ ఫుల్ మాస్ మసాలా స్టోరీ రెడీ చేసారట.

ఊర మాస్ కథకు రామ్ ఎనర్జీ యాడ్ అయితే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కాకపోతే ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ''అఖండ'' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది.

ఇక బోయపాటి శ్రీను లైనప్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. 'ఐకాన్' 'పుష్ప 2' చిత్రాల తర్వాత బన్నీ - బోయపాటి కాంబోలో సినిమా ఉంటుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు రామ్ హీరోగా డైరెక్టర్ లింగుస్వామి తీస్తున్న బైలింగ్వల్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి #RAPO19 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.