Begin typing your search above and press return to search.

చెర్రీ-మణి.. చిరు కారణంతో ఆగింది

By:  Tupaki Desk   |   19 April 2017 6:28 PM IST
చెర్రీ-మణి.. చిరు కారణంతో ఆగింది
X
ధృవ మూవీతో ఫామ్ లోకి వచ్చేసిన మెగా పవర్ స్టార్.. ఆ తర్వాత మణిరత్నంతో సినిమా చేసేందుకు గతంలోనే సై అనేశాడు. మణి రత్నం లాంటి దిగ్గజ డైరెక్టర్ తో ఓ మూవీ చేస్తే.. అది తన మూవీస్ లోనే క్లాసిక్ గా నిలిచిపోతుందని.. కలకాలం జనాలు గుర్తుపెట్టుకునే ఓ మూవీ అవుతుందని రామ్ చరణ్ ఉద్దేశ్యం. నిజానికి చెలియా స్టోరీని మొదట చెర్రీకే వినిపించారు మణిరత్నం.

కానీ కథపై నమ్మకం కుదరకపోగా.. అనేక అనుమానాలు తలెత్తడంతో.. ఈ స్టోరీకి నేను సరిపోనంటూ సైలెంట్ గా తప్పుకున్నాడు చరణ్. కానీ తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే కమిట్మెంట్ ఉండడంతో.. చేయక తప్పదని ఫిక్సయ్యాడట చెర్రీ. అయితే.. వరుస హిట్స్ తో జోష్ మీద ఉన్నపుడు ప్రయోగం చేసినా పర్లేదు కానీ.. ఇప్పుడే ట్రాక్ లోకి వచ్చి మళ్లీ అంతలోనే ప్రయోగం.. ఆఫ్ బీట్.. కొత్తదనం అంటూ ప్రయత్నాలు చేస్తే ఎదురుదెబ్బ తినేస్తావని గాట్టిగా క్లాస్ ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి.

చిరు ఇచ్చిన క్లాస్ దెబ్బకు మణి రత్నం మూవీని ఎలా తప్పించుకోవాలా అనే అంశంపైనే చెర్రీకి ఫోకస్ చేయాల్సి వచ్చింది. చెలియా షాక్ దెబ్బకి ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్ట్ సాకారం అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. అలాగని మణి సార్ ఏమీ ఊరకుండిపోరుకదా.. మళ్లీ ఓకే బంగారం లాంటి లోబడ్జెట్ మూవీతో తిరిగి సక్సెస్ పట్టాలెక్కే ప్రయత్నం మొదలుపెట్టేయడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/