Begin typing your search above and press return to search.

చెర్రీ నిజంగా శుక్రవారం వస్తున్నాడా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 7:30 AM GMT
చెర్రీ నిజంగా శుక్రవారం వస్తున్నాడా?
X
రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తుండగా.. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే చెబుతున్నారు. సినిమా లేట్ అవడంతో.. చెర్రీ దసరాను మిస్ అయిపోయాడని అన్నారు. కానీ దసరాకు ఒక రోజు ముందే అభిమానులను పలకరించనున్నాడట చరణ్.

ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ మూవీ సెప్టెంబర్ 30.. అంటే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రామ్ చరణ్ నటించాడనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. సురేష్ రైనా పాత్రలో చెర్రీ మెరవనున్నాడని అంటున్నారు. నిజానికి ధోనీ సినిమా మొదలైనపుడు ఈ ప్రచారం గట్టిగానే జరిగింది. పలు పోర్టల్స్ లో కూడా రైనాగా రామ్ చరణ్ నటిస్తున్నాడని రాశారు. కానీ కొంతకాలంగా ఈ ప్రచారం ఆగిపోయింది.

ఇప్పుడు సరిగ్గా సినిమా రిలీజ్ కి ముందు మళ్లీ రైనా పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడని.. ఇప్పటికే చెర్రీ తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పేయగా.. ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికే ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారని అంటున్నారు. ధోనీ కెరీర్ లో పక్కనే ఉండే ప్లేయర్ కం ఫ్రెండ్ గా రైనా పాత్ర చాలా ముఖ్యమైనది. మరి సినిమాలో ఈ రోల్ ఏ మేరకు ఉండనుందో.? నిజంగా ఈ పాత్రలో చెర్రీ కనిపిస్తే మాత్రం.. దసరాకి మెగాభిమానులకు పండగే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/