Begin typing your search above and press return to search.
అబ్బే చరణ్ గురించి అన్నీ రూమర్లే
By: Tupaki Desk | 29 Sept 2016 1:56 PM ISTఇప్పటివరకు ఎన్నడూ క్లారిటీ ఇవ్వని రామ్ చరణ్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేశాడు. ఆల్రెడీ ఒకసారి బాలీవుడ్ లో జంజీర్ 2.0 తో అడుగుపెట్టి చేతులు కాల్చుకున్న మెగా పవర్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ లో రెండోసారి హడావుడి చేస్తున్నాడని అందరూ అన్నారు. రేపు రిలీజ్ అవుతున్న ''ఎం.ఎస్.ధోని'' సినిమాలో మనోడు ఒక ప్రత్యేక పాత్రను చేస్తున్నాడనే రూమర్ రావడంతో.. మెగా ఫ్యాన్స్ కూడా ఉత్కంఠతోనే ఎదురు చూస్తున్నారులే.
అయితే విషయం ఏంటంటే.. ఈ సినిమాలో అసలు చరణ్ చేయడం కాదు.. కనీసం చేయమని కూడా ఎవ్వరూ తనని ఎప్రోచ్ కాలేదట. ఇప్పటికే టాలీవుడ్డులో మనోడు సురేష్ రైనా పాత్రలో రేపటి రిలీజ్ లో మెరవనున్నాడు అనే రూమర్లు రావడంతో.. అసలు తాను ఈ సినిమాలో లేనంటూ చరణ్ ఒక క్లారిటీ ఇస్తూ తన మేనేజర్ ద్వారా ప్రెస్ నోట పంపాడు. తద్వారా క్లారిటీ ఇచ్చేశాడు.
ప్రస్తుతం 'ధృవ' షూటింగులో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అక్టోబర్ 1వ వారం నుండి యురోప్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేయనున్నాడు. అక్కడే రెండు పాటలను షూట్ చేస్తారట. ఆ తరువాత చిరంజీవి అండ్ కాజల్ మీద షూట్ చేసే పాటలో ప్రొడ్యూసర్ హోదాలో యురోప్ లోనే పాల్గోనున్నాడు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
అయితే విషయం ఏంటంటే.. ఈ సినిమాలో అసలు చరణ్ చేయడం కాదు.. కనీసం చేయమని కూడా ఎవ్వరూ తనని ఎప్రోచ్ కాలేదట. ఇప్పటికే టాలీవుడ్డులో మనోడు సురేష్ రైనా పాత్రలో రేపటి రిలీజ్ లో మెరవనున్నాడు అనే రూమర్లు రావడంతో.. అసలు తాను ఈ సినిమాలో లేనంటూ చరణ్ ఒక క్లారిటీ ఇస్తూ తన మేనేజర్ ద్వారా ప్రెస్ నోట పంపాడు. తద్వారా క్లారిటీ ఇచ్చేశాడు.
ప్రస్తుతం 'ధృవ' షూటింగులో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అక్టోబర్ 1వ వారం నుండి యురోప్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ తో రొమాన్స్ చేయనున్నాడు. అక్కడే రెండు పాటలను షూట్ చేస్తారట. ఆ తరువాత చిరంజీవి అండ్ కాజల్ మీద షూట్ చేసే పాటలో ప్రొడ్యూసర్ హోదాలో యురోప్ లోనే పాల్గోనున్నాడు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
