Begin typing your search above and press return to search.

ఎన్సీబీ విచారణలో రియా తన ఇంటి వద్ద డ్రగ్స్‌ ఉంచినట్లు ఒప్పుకున్న రకుల్...?

By:  Tupaki Desk   |   25 Sept 2020 10:45 AM IST
ఎన్సీబీ విచారణలో రియా తన ఇంటి వద్ద డ్రగ్స్‌ ఉంచినట్లు ఒప్పుకున్న రకుల్...?
X
బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన హీరోయిన్ రియా చక్రవర్తి మరియు జయసాహా వాట్సాప్ చాటింగ్ ఆధారంగా రకుల్ ని ఈ కేసులో విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై కి చేరుకున్న రకుల్.. ఈ రోజు ఉదయం ఎన్‌సిబి అధికారుల ఎదుట విచారణకు హాజరైంది. ఉదయం గం 10.35 ని.లకు సౌత్ ముంబైలోని కొలాబా ఎన్‌సీబీ గెస్ట్ హౌస్‌ కు రకుల్ చేరుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, రకుల్ ని సుమారు నాలుగు గంటల పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. రకుల్ తో పాటు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను కలిపి విచారించిన ఎన్సీబీ అధికారులు.. జయ సాహా వాట్సాప్ చాటింగ్ ని చూపించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఈ క్రమంలో రియా చక్రవర్తి తనతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్లు రకుల్ ప్రీత్ సింగ్ ఒప్పుకుందని.. రియా తన ఇంటి వద్ద డ్రగ్స్‌ ఉంచిందని.. కానీ దానిని ఎప్పుడూ తాను తీసుకోలేదని రకుల్ ఎన్సీబీ విచారణలో చెప్పినట్లు ఇండియా టుడే వెల్లడించింది. రకుల్ విచారణ 2. 20 pm వరకు కొనసాగిందని సదరు ఛానల్ పేర్కొంది.