Begin typing your search above and press return to search.

ఎనిమిదో వింత అనుభవించేసిందట

By:  Tupaki Desk   |   15 Dec 2016 10:13 AM IST
ఎనిమిదో వింత అనుభవించేసిందట
X
ఈ ఏడాదికి గాను మోస్ట్ సక్సెస్ ఫుల్ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ధృవ మూవీ సక్సెస్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది. ఒకే ఏడాది ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి.. అన్నీ సక్సెస్ లు సాధించడం చిన్న విషయమేమీ కాదు.

అయితే.. చెర్రీతో రకుల్ చేసిన మొదటి మూవీ బ్రూస్ లీ ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. వెంటనే రామ్ చరణ్ తో నటించాలంటూ పిలుపు రావడంతో తెగ ఆశ్చర్యపోయానని చెప్పింది రకుల్. తమ కాంబినేషన్లో ఫ్లాప్ వచ్చినా సరే.. చరణ్ తో వెంటనే ధృవ ఆఫర్ రావడం.. ఎనిమిదో వింతలా అనిపించిందట. అయితే.. సక్సెస్ లు మన చేతుల్లో ఉండవుగా అంటూ ఉదాహరణలు కూడా చెబుతోంది రకుల్. షారూక్-కాజోల్ జంటగా నటించిన అన్నీ హిట్ అయ్యాయా? సల్మాన్-రాణిలు చేసిన మూవీస్ అన్నీ సక్సెస్ లేనా అంటూ ఎదురు ప్రశ్నించింది కూడా.

ధృవలో పరేషానురా సాంగ్ కోసం చాలా కష్టపడ్డానని చెప్పిన రకుల్.. ఈ పాట కోసం వాటర్ మెలన్ డైట్ చేసిందట. పొట్ట కొంచెం కూడా ఎత్తు పెరగకుండా ఉండేందుకు కనీసం నీళ్లు కూడా తాగేది కాదట. గొంతు తడుపుకోవడం.. ఒకటీ అరా పుచ్చకాయ ముక్కలు నమిలి దాహం తీర్చుకునేదిట రకుల్. అంతగా కష్టపడింది కాబట్టే.. ఇప్పుడు ధృవ సక్సెస్ లో క్రెడిట్ ఆమెకు కూడా దక్కుతోంది మరి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/