Begin typing your search above and press return to search.

మొక్కలు నాటిన ముద్దుగుమ్మలు

By:  Tupaki Desk   |   11 Nov 2020 10:50 AM GMT
మొక్కలు నాటిన ముద్దుగుమ్మలు
X
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సినీ ప్రముఖుల నుండి ముఖ్యంగా టావుడ్‌ ప్రముఖుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ప్రముఖ హీరో హీరోయిన్స్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటి వారి సామాజిక బాధ్యతను నెరవేర్చారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరియు ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ లు కూడా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటి వారి సన్నిహితులను కూడా ఈ ఛాలెంజ్‌ కు నామినేట్‌ చేయడం జరిగింది.

నాగచైతన్య గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్క నాటి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను నామినేట్‌ చేశాడు. ఇటీవల ఆమె హైదరాబాద్‌ లో మొక్కను నాటింది. ఈ కార్యక్రమంను ప్రారంభించినందుకు గాను సంతోష్‌ కుమార్‌ గారికి అభినందనలు. ప్రతి ఒక్కరు బాధ్యతతో మొక్కలు నాటాలని అంది. ఈ ఛాలెంజ్‌ లో తన అభిమానులందరిని కూడా నామినేట్‌ చేస్తున్నట్లుగా పేర్కొంది. మరో ముద్దుగుమ్మ నభా నటేష్‌ తనంతట తానుగానే ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించింది. పచ్చదనంను కాపాడటం కోసం ఎంపీ గారు ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ స్ఫూర్తితో నేను మొక్కలు నాటాను. నా స్నేహితులు అయిన అనూ ఇమాన్యూల్‌.. నిధి అగర్వాల్‌.. బెల్లంకొండ శ్రీనివాస్‌ లను తాను నామినేట్‌ చేస్తున్నట్లుగా పేర్కొంది.