Begin typing your search above and press return to search.
మీడియా హంగామా కి విమానాశ్రమంలో కంగారు పడ్డ రకుల్ !
By: Tupaki Desk | 25 Sept 2020 11:00 AM ISTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం అనంతర ట్విస్టులు తెలిసిందే. బాలీవుడ్ డ్రగ్స్ తో ముడిపడిన జీవనవిధానంలో సంచలనాలెన్నో బయటపడుతున్నాయి. బాలీవుడ్ పార్టీ కల్చర్ లో మత్తు కిక్కుకు సంబంధించిన అంశాలెన్నో అతఃహశుల్ని చేస్తున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎన్.సి.బి నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిర్ రకుల్ ప్రీత్ సింగ్ సమన్లు అందుకున్నారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
గురువారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రకుల్ ప్రీత్ ను ఓ ప్రముఖ జాతీయ మీడియా వెంబడించి ప్రశ్నించేందుకు ప్రయత్నించిందట. అయితే తాను మౌనంగా ఉండి ప్రశ్నలను తప్పించుకుందని సదరు జాతీయ మీడియా కథనాల్ని ప్రచురించింది.
బాలీవుడ్-డ్రగ్స్ కేసులో ఏజెన్సీ నిర్వహిస్తున్న దర్యాప్తులో రకుల్ ప్రీత్ సింగ్ తనకు పంపిన సమన్లు అంగీకరించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) గురువారం తెలిపింది. ఆ క్రమంలోనే ప్రముఖ మీడియా గురువారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రకుల్ ప్రీత్ ను వెంబడించింది. ఆ క్రమంలోనే అక్కడ బోలెడంత మెలో డ్రామా నడిచిందని సదరు మీడియా కథనాలు ప్రచురించింది.
రకుల్ ప్రీత్ గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ముంబైలో అడుగుపెట్టాడు. అంతకుముందు రోజు ఓ అధికారిక ప్రకటనలో ``ఇప్పటివరకు ముంబై లేదా హైదరాబాద్ అడ్రెస్ లో ఆరోపణలకు సంబంధించిన సమన్లు రాలేదు`` అని అన్నారు. అయితే ఈ కేసులో `తప్పుదారి పట్టించే ప్రయత్నం` రకుల్ చేశారని ఆమె సహకరించకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్.బిడబ్ల్యు) రాబోతోందని ఎన్.సిబి ఆగ్రహం వ్యక్తం చేసిందని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. దీని తరువాత రకుల్ ప్రీత్ బృందం సమన్లు అందుకున్నట్లు ధృవీకరించింది. శుక్రవారం (నేడు) ఆమె దర్యాప్తులో చేరబోతున్నట్లు నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
గురువారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రకుల్ ప్రీత్ ను ఓ ప్రముఖ జాతీయ మీడియా వెంబడించి ప్రశ్నించేందుకు ప్రయత్నించిందట. అయితే తాను మౌనంగా ఉండి ప్రశ్నలను తప్పించుకుందని సదరు జాతీయ మీడియా కథనాల్ని ప్రచురించింది.
బాలీవుడ్-డ్రగ్స్ కేసులో ఏజెన్సీ నిర్వహిస్తున్న దర్యాప్తులో రకుల్ ప్రీత్ సింగ్ తనకు పంపిన సమన్లు అంగీకరించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) గురువారం తెలిపింది. ఆ క్రమంలోనే ప్రముఖ మీడియా గురువారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రకుల్ ప్రీత్ ను వెంబడించింది. ఆ క్రమంలోనే అక్కడ బోలెడంత మెలో డ్రామా నడిచిందని సదరు మీడియా కథనాలు ప్రచురించింది.
రకుల్ ప్రీత్ గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ముంబైలో అడుగుపెట్టాడు. అంతకుముందు రోజు ఓ అధికారిక ప్రకటనలో ``ఇప్పటివరకు ముంబై లేదా హైదరాబాద్ అడ్రెస్ లో ఆరోపణలకు సంబంధించిన సమన్లు రాలేదు`` అని అన్నారు. అయితే ఈ కేసులో `తప్పుదారి పట్టించే ప్రయత్నం` రకుల్ చేశారని ఆమె సహకరించకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్.బిడబ్ల్యు) రాబోతోందని ఎన్.సిబి ఆగ్రహం వ్యక్తం చేసిందని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. దీని తరువాత రకుల్ ప్రీత్ బృందం సమన్లు అందుకున్నట్లు ధృవీకరించింది. శుక్రవారం (నేడు) ఆమె దర్యాప్తులో చేరబోతున్నట్లు నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
