Begin typing your search above and press return to search.

మీడియా హంగామా కి విమానాశ్రమంలో కంగారు పడ్డ రకుల్ !

By:  Tupaki Desk   |   25 Sept 2020 11:00 AM IST
మీడియా హంగామా కి విమానాశ్రమంలో కంగారు పడ్డ రకుల్ !
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం అనంత‌ర ట్విస్టులు తెలిసిందే. బాలీవుడ్ డ్ర‌గ్స్ తో ముడిప‌డిన జీవన‌విధానంలో సంచ‌ల‌నాలెన్నో బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బాలీవుడ్ పార్టీ క‌ల్చ‌ర్ లో మ‌త్తు కిక్కుకు సంబంధించిన‌ అంశాలెన్నో అతఃహ‌శుల్ని చేస్తున్నాయి. ఇక ఈ కేసులో ఇప్ప‌టికే ఎన్.సి.బి నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిర్ ర‌కుల్ ప్రీత్ సింగ్ స‌మ‌న్లు అందుకున్నార‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి.

గురువారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రకుల్ ప్రీత్ ‌ను ఓ ప్ర‌ముఖ జాతీయ మీడియా వెంబ‌డించి ప్ర‌శ్నించేందుకు ప్ర‌య‌త్నించింద‌ట‌. అయితే తాను మౌనంగా ఉండి ప్రశ్నలను తప్పించుకుంద‌ని స‌ద‌రు జాతీయ మీడియా క‌థ‌నాల్ని ప్ర‌చురించింది.

బాలీవుడ్-డ్రగ్స్ కేసు‌లో ఏజెన్సీ నిర్వహిస్తున్న దర్యాప్తులో రకుల్ ప్రీత్ సింగ్ తనకు పంపిన సమన్లు అంగీకరించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) గురువారం తెలిపింది. ఆ క్ర‌మంలోనే ప్ర‌ముఖ మీడియా గురువారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రకుల్ ప్రీత్ ను వెంబ‌డించింది. ఆ క్ర‌మంలోనే అక్క‌డ బోలెడంత మెలో డ్రామా న‌డిచింద‌ని స‌ద‌రు మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది.

రకుల్ ప్రీత్ గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ముంబైలో అడుగుపెట్టాడు. అంతకుముందు రోజు ఓ అధికారిక ప్రకటనలో ``ఇప్పటివరకు ముంబై లేదా హైదరాబాద్ అడ్రెస్ లో ఆరోపణలకు సంబంధించిన స‌మన్లు రాలేదు`` అని అన్నారు. అయితే ఈ కేసులో `తప్పుదారి పట్టించే ప్రయత్నం` ర‌కుల్ చేశార‌ని ఆమె సహకరించకపోతే నాన్-బెయిలబుల్ వారెంట్ (ఎన్‌.బిడబ్ల్యు) రాబోతోందని ఎన్‌.సిబి ఆగ్రహం వ్యక్తం చేసిందని జాతీయ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది. దీని తరువాత రకుల్ ప్రీత్ బృందం సమన్లు అందుకున్నట్లు ధృవీకరించింది. శుక్రవారం (నేడు) ఆమె దర్యాప్తులో చేరబోతున్నట్లు నేష‌న‌ల్ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.