Begin typing your search above and press return to search.

మళ్లీ కూతురు దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   8 July 2021 8:30 AM GMT
మళ్లీ కూతురు దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అన్నాత్తే షూటింగ్ ను పూర్తి చేసి అమెరికా వెళ్లారు. అక్కడ చికిత్స నిమిత్తం కొన్ని నెలల పాటు ఉంటారు. ఆ తర్వాత ఆయన ఇండియా వచ్చి కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అన్నాత్తే సినిమా దీపావళికి విడుదల కాబోతుంది.. అంతకు ముందే రజినీకాంత్ తదుపరి సినిమా ను పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ లో ఆ సినిమా విడుదల కాబోతున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఆ సినిమా కు దర్శకత్వం వహించబోతున్నది ఎవరు అనే విషయమై చర్చ జరుగుతోంది. తాజాగా తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ తదుపరి సినిమాకు ఆయన కూతురు సౌందర్య దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.

రజినీకాంత్‌ గతంలో తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడియన్‌' అనే సినిమాను చేశాడు. ఆ సినిమా పూర్తిగా మోషన్‌ గ్రాఫిక్స్ టెక్నాలజీతో రూపొందించారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ ముందు డిజాస్టర్ గా నిలిచింది. ఇతర భాషల్లో కూడా ఆ సినిమా ఆడిందే లేదు. ఆ సినిమా తర్వాత సౌందర్య ఒక సినిమాను తెరకెక్కించింది. ధనుష్‌ హీరోగా నటించిన ఆ సినిమా కూడా నిరాశ పర్చింది. అయితే వెబ్‌ సిరీస్ మరియు ఇతర షో లతో ఎప్పుడు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వస్తున్న సౌందర్య మంచి రచయిత అనే టాక్ ఉంది. అందుకే మరో సారి కూతురు దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రజినీకాంత్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈసారి తన తండ్రికి ఖచ్చితంగా ఒక సూపర్‌ హిట్‌ ను ఇస్తాను అనే నమ్మకంతో ఆమె ఉన్నారట.

సౌందర్య కథ సిద్దం చేసిందని.. ప్రముఖ రచయితలతో కలిసి స్రిప్ట్‌ ను కూడా ఆమె సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రజినీకాంత్‌ అమెరికా నుండి వచ్చిన వెంటనే షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా వ్యవహారంలో రజినీకాంత్‌ పాత్ర కూడా ప్రముఖంగా ఉంటుందని అంటున్నారు. మరోసారి రజినీకాంత్‌ ను రజినీకాంత్ ను వెండి తెరపై చూపించేందుకు సౌందర్య గత ఆరు సంవత్సరాలుగా వెయిట్‌ చేస్తుంది. ఎట్టకేలకు సరైన కథ సెట్‌ అవ్వడంతో ఆయనతో సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. తమిళ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా ఈ సినిమా ఒక ఫాంటసీ కథతో తెరకెక్కబోతుందట. భారీ బడ్జెట్‌ తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చిందట. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.

అన్నాత్తే సినిమా ను శివ దర్శకత్వం లో చేసిన రజినీకాంత్‌ వచ్చే దీపావళి కానుకగా సినిమా ను విడుదల చేయబోతున్నాడు. శివ దర్శకత్వం లో ఇప్పటికే వచ్చిన సినిమా లు పక్కా కమర్షియల్‌ సినిమా లుగా నిలిచాయి. కనుక రజినీకాంతో తో కూడా ఆయన ఒక మంచి కమర్షియల్‌ సినిమా ను తెరకెక్కించి ఉంటాడు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. అన్నాత్తే లో కీర్తి సురేష్‌ మరియు నయనతారలతో పాటు సీనియర్‌ హీరోయిన్స్‌ ఖుష్బు మరియు మీనాలు కూడా నటించారని వార్తలు వస్తున్నాయి.

ఇక రజినీకాంత్‌ అన్నాత్తే తర్వాత రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకున్నా కూడా అనారోగ్యం కారణంగా రాజకీయాల ఆలోచన ను తొలగించాడు. కనుక ముందు ముందు రజినీకాంత్‌ మరిన్ని సినిమాలు చేస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అన్నాత్తే సినిమా షూటింగ్ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. తిరిగి కోలుకున్న రజినీకాంత్‌ సినిమా షూటింగ్ ను ముగించాడు. అయినా కూడా ఒక సారి చికిత్స కోసం అమెరికా వెళ్లడం మంచిదని ప్రస్తుతం అక్కడ ఉన్నాడు.