Begin typing your search above and press return to search.

రజినీ 'అన్నాతే' షూటింగ్ కి మళ్ళీ బ్రేక్.. యూనిట్ లో 8మందికి కరోనా..!

By:  Tupaki Desk   |   23 Dec 2020 11:04 AM GMT
రజినీ అన్నాతే షూటింగ్ కి మళ్ళీ బ్రేక్.. యూనిట్ లో 8మందికి కరోనా..!
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అన్నాతే'. మాస్ డైరెక్టర్ సిరుతై శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నయనతార - కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణంతో రూపొందుతోంది. రజినీ కెరీర్లో 168వ సినిమాగా వస్తున్న 'అన్నాతే'పై తలైవా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోవిడ్‌ కారణంగా ఆగిపోయింది. అయితే ఈ చిత్ర షూటింగ్ ని తిరిగి ప్రారంభించడానికి రజినీకాంత్ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం 'అన్నాతే' షూటింగ్ కి మరోసారి బ్రేక్స్ పడ్డాయని తెలుస్తోంది.

హైదరాబాద్ షెడ్యూల్ లో రజినీ - నయనతార మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడని సంకల్పించారు. రామోజీ ఫిలిం సిటీలో ఇద్దరి మధ్య కొన్ని సీన్స్ కూడా తీసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో శరవేగంగా షూటింగ్ జరిపి మేజర్ పార్ట్ సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న మేకర్స్ కి కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసింది. తాజాగా 'అన్నాతే' టీమ్ మెంబెర్స్ కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8 మంది సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో అర్ధాంతరంగా షూటింగ్ నిలిపివేశారని సమాచారం. రజినీకాంత్ కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి చెన్నై కి బయలుదేరే అవకాశం ఉందని తెలుస్తోంది. పొలిటికల్ పార్టీ పెట్టబోతున్న రజినీ 'అన్నాతే' బ్యాలెన్స్ షూటింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని అనుకున్నారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటించే లోపు హైదరాబాద్ షెడ్యూల్ ని కంప్లీట్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి.