Begin typing your search above and press return to search.

మ‌రో రైట‌ర్ డైరెక్ట‌ర‌య్యాడు

By:  Tupaki Desk   |   3 Oct 2015 1:30 AM GMT
మ‌రో రైట‌ర్ డైరెక్ట‌ర‌య్యాడు
X
టాలీవుడ్‌లో ఇప్పుడు రైట‌ర్ల కాలం న‌డుస్తోంది. ఒక‌ప్పుడు క‌లంతో కుస్తీలు ప‌ట్టిన రైట‌ర్లంతా ఇప్పుడు మెగాఫోన్ అందుకొని అద‌ర‌గొడుతున్నారు. ద‌ర్శ‌కుల‌యిన చాలా మంది ర‌చ‌యిత‌లు విజ‌యాల్నే సొంతం చేసుకొన్నారు. అందుకే నిర్మాత‌లు కూడా రైట‌ర్ లని బాగా ప్రోత్స‌హిస్తున్నారు. ఒక మాదిరి క‌థ తీసుకొచ్చినా వాళ్ల‌పై న‌మ్మ‌కంతో అవ‌కాశాల్ని క‌ట్ట‌బెడుతున్నారు.

తాజాగా రాజసింహ అనే రైట‌ర్ కూడా ద‌ర్శ‌కుడ‌య్యాడు. కోన వెంక‌ట్‌ - గోపీమోహ‌న్‌ - బి.వి.ఎస్‌.ర‌వి త‌దిత‌ర రైట‌ర్ల‌తో క‌లిసి ప‌నిచేశాడు రాజ‌సింహ‌. మంచి టాలెంటెడ్ రైట‌ర్‌ గా ఆయ‌న‌కి పేరుంది. చాలా రోజులుగా రైట‌ర్ కావాల‌ని ప్ర‌య‌త్నించిన ఆయ‌న ఎట్ట‌కేల‌కు త‌న క‌ల‌ను సాకారం చేసుకొంటున్నారు. సందీప్‌ కిష‌న్ హీరోగా `ఆల్ ఇండియ‌న్స్ ఆర్ మై బ్ర‌ద‌ర్స్ అండ్ సిస్ట‌ర్స్‌... ఒక్క అమ్మాయి త‌ప్ప‌` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ రోజే రామానాయుడు స్టూడియోలో ఆ సినిమా ప్రారంభ‌మైంది.

పేరునుబ‌ట్టే ఈ క‌థ కాస్త టిపిక‌ల్‌గా ఉండే అవ‌కాశాలున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. పైగా సందీప్‌ కిష‌న్ క‌థ‌ల విష‌యంలో చాలా ప‌క్క‌గా ఉంటాడు. ఇన్నొవేటివ్ స్టోరీ అనిపిస్తేనే ఆయ‌న ఒప్పుకొంటాడు. సో... రాజ‌సింహ ఓ కొత్త క‌థ‌నే త‌యారు చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. వి.వి.వినాయ‌క్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి హ‌జ‌ర‌య్యాడు. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు కెమెరామెన్‌గా ప‌నిచేస్తుండ‌గా మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. మిక్కీ ఇదివ‌ర‌కు సందీప్‌ కిష‌న్ న‌టించిన రొటీన్ ల‌వ్‌ స్టోరీ సినిమాకి ప‌నిచేశాడు.