Begin typing your search above and press return to search.

పూరి 'జనగణమన' : డిలీట్‌ చేసినా చేయకున్నా ఆ ఫ్యాన్స్ తో ఎటాక్‌ తప్పదు

By:  Tupaki Desk   |   29 March 2022 5:30 PM GMT
పూరి జనగణమన : డిలీట్‌ చేసినా చేయకున్నా ఆ ఫ్యాన్స్ తో ఎటాక్‌ తప్పదు
X
రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండతో 'లైగర్‌' సినిమాను పూరి జగన్నాద్‌ తెరకెక్కించాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న లైగర్‌ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది. సినిమాను ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్‌ పూర్తి అయిన ఇన్నాళ్లు ఏం చేస్తారు అనేది కొందరి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం అయితే లేదు కాని.. ఈ గ్యాప్‌ లో పూరి మరియు విజయ్‌ దేవరకొండ కలిసి మరో సినిమా చేయబోతున్నారు.

లైగర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన సమయంలో తర్వాత జనగణమన అంటూ పూరి ప్రకటించిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండతో పూరి జనగణమన సినిమా రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అనూహ్యంగా సినిమా ను వెంటనే ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఆ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్‌ పూరి, రౌడీ ల కాంబో సినిమాలు తెరకెక్కడం హాట్‌ టాపిక్ గా ఉంది.

ఇదే సమయంలో పూరి జగన్నాధ్‌ పై మహేష్ బాబు అభిమానులు టార్గెట్‌ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. దాదాపు అయిదు ఆరు సంవత్సరాల క్రితం పూరి జగన్నాధ్‌ సోషల్‌ మీడియా ద్వారా తాను మహేష్ బాబుతో జనగణమన సినిమాను తీస్తాను అంటూ ప్రకటించాడు. కొన్ని కారణాల వల్ల సినిమా ప్రారంభం అవ్వలేదు. కారణం ఏంటో కాని ఇప్పుడు అదే సినిమా ను పూరి జగన్నాద్‌ రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండతో చేసేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది.

ఒక వేళ మహేష్ బాబు తో అనుకున్న జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో పూరి చేసేందుకు సిద్దం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనపై ట్రోల్స్ ఓ రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకాశమే హద్దు అన్నట్లుగా మహేష్ బాబు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా పూరిని టార్గెట్ చేస్తారు. పూరి జగన్నాద్‌ గతంలో షేర్ చేసిన మహేష్ బాబు జనగణమన పోస్టర్ ను ఎందుకు ఇంకా ఉంచావు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వేళ మహేష్‌ బాబు పోస్టర్ ను కనుక పూరి జగన్నాద్‌ తొలగిస్తే రచ్చ మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ పోస్టర్ అలాగే ఉంచితే విమర్శలు తప్పవు.. డిలీట్ చేస్తే మహేష్ బాబు అభిమానులు నెట్టింట ఓరేంజ్ లో ఆయన్ను కుమ్మేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సమయంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ ఏం చేస్తారు అనేది చూడాలి. మహేష్ బాబు తోనే జనగణమన చేసి ఉంటే బాగుండేది అంటూ అభిమానుల కోరిక.

కాని మహేష్‌ బాబు మరియు పూరిల మద్య జనగణమన సినిమాకు సంబంధించిన చర్చలు కాని.. అసలు సినిమాకు సంబంధించిన విషయాలు కాని చర్చకు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. దాంతో రౌడీ స్టార్ వద్దకు ఈ సినిమా వెళ్లి పోయింది. ఇప్పుడు మహేష్‌ బాబు అభిమానులు ఈ సినిమా కు సంబంధించి హడావుడి చేయడం సబబు కాదు అనేది కొందరి అభిప్రాయం. మరి కాసేపట్లో అనౌన్స్ కాబోతున్న ఈ సినిమా కు సబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.