Begin typing your search above and press return to search.

డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేస్తున్నారట

By:  Tupaki Desk   |   9 March 2017 11:22 AM GMT
డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేస్తున్నారట
X
టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్లు చాలానే ఉంటాయి. ప్రస్తుతం అతి ఎక్కువగా జనాలు పట్టించుకున్నది.. ట్రేడ్ జనాలు చూస్తున్నది.. హీరో-డైరెక్టర్ కాంబినేషన్ నే. స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్లను పరిశీలిస్తే.. పూరీ-రవితేజ కాంబోకు చాలా ఏళ్లుగా విపరీతమైన క్రేజ్ ఉంది. అటు పూరీ డైరెక్టర్ గా కుదురుకున్నప్పటి నుంచి రవితేజతో సినిమాలు తీస్తూనే ఉన్నాడు.

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం నుంచి.. రీసెంట్ గా వచ్చిన దేవుడు చేసిన మనుషులు వరకూ ఐదు సినిమాలు చేశారు వీరిద్దరు. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి హిట్ చిత్రాలుగా నిలవగా.. ఈడియట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన నేనింతే కమర్షియల్ గా హిట్ కాకపోయినా.. అనేకానేక అవార్డులను అయితే తెచ్చిపెట్టింది. పూరీ-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం దేవుడు చేసిన మనుషులు కూడా ఓ డిఫరెంట్ ఎటెంప్ట్ గానే చెప్పాలి. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జట్టు కట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రవితేజ కోసం కథను కూడా సిద్ధం చేసేశాడట పూరీ. మరోవైపు పూరీ జగన్నాధ్ తో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నానని ఇప్పటికే చెప్పేశాడు రవితేజ. డబుల్ హ్యాట్రిక్ మూవీ కోసం ఇద్దరూ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇవాళే బాలయ్యతో సినిమా మొదలు పెట్టిన పూరీ జగన్నాధ్.. ఇది పూర్తవగానే రవితేజ సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/