Begin typing your search above and press return to search.

పవన్ బర్త్ డే స్పెషల్ గా #PSPK28 ప్రీ లుక్ పోస్టర్..!

By:  Tupaki Desk   |   2 Sep 2021 10:59 AM GMT
పవన్ బర్త్ డే స్పెషల్ గా #PSPK28 ప్రీ లుక్ పోస్టర్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత అర డజను చిత్రాలకు కమిట్ అయినా.. అభిమానుల కళ్ళన్నీ ఒక్క సినిమాపై ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఎన్ని సరికొత్త అప్డేట్స్ వస్తున్నా ఫ్యాన్స్ దృష్టంతా ఆ సినిమాపైనే ఉంది. అదే #PSPK28. పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ - పవన్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతేడాది పవన్ బర్త్ డే నాడు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PSPK28 కాన్సెప్ట్ పోస్టర్‌ తోనే అంచనాలు పెంచేసిన మేకర్స్.. ఈసారి జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదని చెబుతూ వస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ - టైటిల్‌ ను విడుదల చేస్తారనుకుంటే.. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్స్ వేసింది. ఈ క్రమంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే పండుగ వచ్చేసింది. బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న 'జాతర షురూ' అంటూ ప్రీ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. చెప్పినట్లుగానే తాజాగా ఓ పోస్టర్ ని వదిలారు.

పవన్ కళ్యాణ్ ఫేస్ చూపించకుండా డిజైన్ చేయబడిన ఈ ప్రీ లుక్ పోస్టర్ లో ఇండియా గేట్ ముందు ఓ ట్రెండీ బైక్ మీద హీరో కూర్చుని ఉన్నట్టు చూపించారు. ఇందులో మళ్ళీ ఫుల్లీ లోడింగ్ అని పేర్కొన్నారు. అయితే జాతర షురూ అని చెప్పడంతో, ప్రీ లుక్ మీద భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు మాత్రం.. ఈ పోస్టర్ చూసి డిజప్పాయింట్ అయినట్లు కామెంట్స్ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ బర్త్ డే కి రిలీజ్ చేసిన పోస్టర్ లో ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ - సుభాష్ చంద్రబోస్ ఫోటోలు చూపిస్తూ.. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష - గులాబీ పువ్వు ను చూపించిన సంగతి తెలిసిందే. ఇకపోతే మేకర్స్ 'జాతర' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో ఇదే టైటిల్ అయ్యుంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు.

#PSPK28 చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మేకర్స్ వెల్లడించలేదు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రానున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.