Begin typing your search above and press return to search.

సుధీర్ బాబు సినిమాలో భాగమైన మైత్రీ నిర్మాతలు..!

By:  Tupaki Desk   |   29 Dec 2021 6:52 AM GMT
సుధీర్ బాబు సినిమాలో భాగమైన మైత్రీ నిర్మాతలు..!
X
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు - డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి''. 'సమ్మోహనం' 'వి' సినిమాల తర్వాత వీరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో సుధీర్ బాబు సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి మహేంద్రబాబు - కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' సినిమా నిర్మాణంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ భాగం అయింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ చిత్ర బృందం ఓ వీడియోని రిలీజ్ చేసింది. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరియు ఆకర్షణీయమైన టైటిల్ తో ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ లో మైత్రీ మూవీ మేకర్స్ భాగం కావడం అడ్వాంటేజ్ అవుతుందని భావించవచ్చు.

కాగా, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రాన్ని అద్భుతమైన ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తుండగా.. పి జి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ - కళ్యాణి నటరాజన్ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.