Begin typing your search above and press return to search.

అ! దర్శకుడితో యాంగ్రీ మ్యాన్

By:  Tupaki Desk   |   21 July 2018 6:09 AM GMT
అ! దర్శకుడితో యాంగ్రీ మ్యాన్
X
ముప్పై ఏళ్ళ క్రితం అంకుశం సినిమా వచ్చాక రాజశేఖర్ ఇమేజే మారిపోయింది. అప్పటి దాకా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న తనకు పోలీస్ ఆఫీసర్ గా అంకుశం ఇచ్చిన బ్రేక్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. దాని తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే చార్మినార్ ముందు రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకెళ్లే రాజశేఖర్ చాలా కాలం ప్రేక్షకుల మనసులో నుంచి బయటికి వెళ్లలేకపోయాడు. అంతటి పేరు తీసుకొచ్చిన అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రాజశేఖర్ మరోసారి కనిపించబోతున్నట్టు టాక్. గత ఏడాది వచ్చిన గరుడవేగా మంచి స్పందన తెచ్చుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా ఓవర్ ఫ్లో కావడంతో అంత సేఫ్ గా బయటపడలేకపోయింది. అందుకే కొంత గ్యాప్ తీసుకుని అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిలిం నగర్ సమాచారం. షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.

ఇందులో మరో విశేషం కూడా ఉందట. కథా నేపధ్యం 1970 నాటి టైంలో ఉంటుందట. అంటే ఇప్పటి టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ఏమి లేని ఒక మామూలు ప్రపంచానికి తీసుకెళ్ళబోతున్నారట. అచ్చం అంకుశం తరహాలో పోలీస్ స్టేషన్ లో ల్యాండ్ లైన్ ఫోన్లు మ్రోగే కాలానికి తీసుకెళ్ళబోతున్నారు. కథ ఓకే అయ్యింది కాబట్టి స్క్రిప్ట్ పనుల్లో ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం తమన్నా టైటిల్ రోల్ చేస్తున్న క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మి టేకప్ చేసిన ప్రశాంత్ వర్మ మరో రెండు నెలల్లో దాన్ని పూర్తి చేసి రాజశేఖర్ మూవీ పనుల్లో దిగవచ్చని ఇన్ సైడ్ టాక్. తమ హీరో సినిమాలు బాగా తగ్గిపోయి డల్ గా ఉన్న ఫాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. యాంగ్రీ యంగ్ మ్యాన్ వయసులో మార్పు వచ్చి ఉండవచ్చు సరైన కథ పడితే ఆగ్రహం రేంజ్ ఎక్స్ పోజర్ మరోసారి చూడొచ్చని అంటున్నారు. మరి ప్రశాంత్ వర్మ ఆ స్థాయిలో అంచనాలు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.