Begin typing your search above and press return to search.

కరోనాకు ‘జాన్‌’ భయపడలేదు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   10 March 2020 7:13 AM GMT
కరోనాకు ‘జాన్‌’ భయపడలేదు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌
X
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా కొన్ని వందల సినిమాల షూటింగ్స్‌ క్యాన్సిల్‌ అయ్యాయి. అలాగే ఎన్నో హాలీవుడ్‌ సినిమాల విడుదల వాయిదా వేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమా షూటింగ్‌ ను కూడా కరోనా వైరస్‌ కారణంగా క్యాన్సిల్‌ చేశారంటూ మూడు నాలుగు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. యూరప్‌ లో జరగాల్సిన షూటింగ్‌ ను క్యాన్సిల్‌ చేశారనేది ఆ వార్తల సారాంశం.

రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్‌ 20 సినిమా షూటింగ్‌ ఎలాంటి అవాంతరం లేకుండా యూరప్‌ లో జరుగుతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా నిన్న రాత్రి సమయంలో ప్రభాస్‌ 20 చిత్రం షూటింగ్‌ అప్‌ డేట్స్‌ ను ప్రకటించాడు. ఒక చక్కని చేజింగ్‌ సీన్‌ ను ఇంటర్నేషనల్‌ టెక్నీషియన్స్‌ తో చక్కగా చిత్రీకరించాం. యూరప్‌ లో ఇంకా షూటింగ్‌ జరగాల్సి ఉందని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ తో కరోనాకు ప్రభాస్‌ 20 యూనిట్‌ సభ్యులు భయపడలేదని.. షూటింగ్‌ కు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కొనసాగుతుందని తేలిపోయింది.

సాహో చిత్రం తర్వాత ప్రభాస్‌ చేస్తున్న ఈ సినిమాకు మొదట జాన్‌ అని టైటిల్‌ అనుకున్నారు. ఇప్పుడు ఓ డియర్‌ తో పాటు మరికొన్ని టైటిల్స్‌ ను కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ విషయం లో క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు యూరప్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత సినిమా టీజర్‌ ను ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారట. సినిమాను దసరాకు విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

విడుదల తేదీపై కూడా టీజర్‌ విడుదల సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్‌ లవ్‌ స్టోరీని తెలుగుతో పాటు పాన్‌ ఇండియా లెవల్‌ లో విడుదల చేసేందుకు యూవీ వారు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.