Begin typing your search above and press return to search.

బాహుబలి జంట సోషల్‌ మీడియా జోరు మామూలుగా లేదు!!

By:  Tupaki Desk   |   18 July 2020 7:30 AM GMT
బాహుబలి జంట సోషల్‌ మీడియా జోరు మామూలుగా లేదు!!
X
బాహుబలి చిత్రంతో ప్రభాస్‌.. అనుష్కలు ఆల్‌ ఇండియా స్టార్‌ డం ను దక్కించుకున్నారు. వీరిద్దరు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రికార్డు స్థాయి ఫాలోవర్స్‌ ను దక్కించుకుని సౌత్‌ లోనే టాప్‌ సెలబ్రెటీల జాబితాలో నిలిచారు. ఇటీవలే ఫేస్‌ బుక్‌ లో 16 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ను క్రాస్‌ అయిన ప్రభాస్‌ సౌత్‌ నుండి అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన హీరోల జాబితాలో టాప్‌ లో నిలిచాడు. ప్రభాస్‌ కు సౌత్‌ లోనే కాకుండా ఉత్తరాది అభిమానులు కూడా భారీగా ఉండటంతో ఆ సంఖ్యను చేరుకున్నాడు. ప్రభాస్‌ మాత్రమే కాకుండా అనుష్క కూడా ఫేస్‌ బుక్‌ లో సత్తా చాటింది.

అనుష్క ఇంతకు ముందే 20 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ను క్రాస్‌ చేసింది. తాజాగా మరో మిలియన్‌ మంది ఫాలోవర్స్‌ ను కలుపుకుని 21 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ తో సౌత్‌ లోనే టాప్‌ హీరోయిన్‌ గా నిలిచింది. ఫేస్‌ బుక్‌ లో అనుష్క క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈమద్య కాలంలో సినిమాలు పెద్దగా చేయకున్నా కూడా అనుష్క నిశబ్దంగా ఫేస్‌ బుక్‌ లో ఫాలోవర్స్‌ ను పెంచుకుంటూ వెళ్తూనే ఉంది. అనుష్క ట్విట్టర్‌ మరియు ఇన్‌ స్టా గ్రామ్‌ లో కూడా అనుష్క ఫాలోవర్స్‌ సంఖ్య భారీగా ఉంది.

అనుష్క త్వరలో ‘నిశబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా నెలలు అయ్యింది. గతంలో విడుదలకు కొన్ని అడ్డంకులు రాగా ఇప్పుడు కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఓటీటీ డైరెక్ట్‌ రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మేకర్స్‌ కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు. త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ నిర్మాతల్లో ఒకరు పేర్కొన్నారు.