Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని ఫాలో అవుతున్న ప‌వ‌ర్ స్టార్‌, చ‌ర‌ణ్‌

By:  Tupaki Desk   |   27 Jan 2022 11:30 PM GMT
మెగాస్టార్ ని ఫాలో అవుతున్న ప‌వ‌ర్ స్టార్‌, చ‌ర‌ణ్‌
X
మెగాస్టార్ చిరంజీవిని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫాలో అవుతున్నారట‌. గ‌త కొంత కాలంగా చిరు త‌ర‌హాలో రేర్ ఫీట్ ని చేయ‌ని ఈ క్రేజీ స్టార్ ప్ర‌స్తుతం ఒకే సారి చిరుని ఫాలో అవుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్ లో సూప‌ర్ హిట్ లుగా నిలిచిన బిల్లా - రంగ‌, బందిపోటు సింహం, రిక్షావోడు, స్నేహం కోసం, అంద‌రి వాడు వంటి త‌దిత‌ర చిత్రాల్లో ద్వి పాత్రాభిన‌యం చేశారు. ఈ చిత్రాల ప్ర‌త్యేక‌త ఏంటంటే వీటిల్లో చిరంజీవి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేయ‌డం. ఆయ‌న కెరీర్ లో ఈ చిత్రాలు ప్ర‌త్యేకంగా నిలిచిపోయాయి.

మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీర‌య్య‌` చిత్రంలో ఇదే త‌ర‌హా పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. కె.ఎస్‌. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో చిరంజీవి తండ్రిగా, కొడుకుగా రెండు భిన్నమైన ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇదిలా వుంటే మెగాస్టార్ త‌ర‌హాలోనే మెగా హీరోలు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా విభిన్న‌మైన పాత్ర‌ల్లో తొలిసారి క‌నిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్‌` త‌రువాత హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న`భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రంలో ప‌వ‌న్ తండ్రి కొడుకులుగా తొలి సారి క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇందులో ఆయ‌న పాత్ర‌ల యాస కూడా తెలంగాణ మాండ‌లికంలో సాగుతుంద‌ని చెబుతున్నారు. త‌న కెరీర్ లో ఇంత వ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ తండ్రీ కొడుకులుగా న‌టించ‌లేదు. ఇదే తొలిసారి కావ‌డంతో ఈ మూవీ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అంతే కాకుండా ప‌వ‌న్ ద్వి పాత్రాభిన‌యం చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌. `గ‌బ్బర్ సింగ్‌`లో ప‌వ‌న్ ని కొత్త‌గా చూపించి మంచి మార్కులు కొట్టేసిన హ‌రీష్ శంక‌ర్ మ‌రో సారి త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని వాడుకుంటూ ప‌వ‌న్ ని స‌రికొత్త‌గా ప్ర‌జెంట్ చేసి అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని చెప్పుకుంటున్నారు.

ఇక ప‌వ‌న్ త‌ర‌హాలోనే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా షాకివ్వ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కెరీర్ లో తొలి సారి రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా ద్వా పాత్రాభిన‌యం లో క‌నిపించ‌బోతున్నార‌ని, రెండు పాత్ర‌లు కూడా చాలా భిన్నంగా స‌రికొత్త మేకోవ‌ర్ తో వుండ‌బోతున్నాయ‌ని చెబుతున్నారు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలోనే చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభిన‌యం చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌.

ఇప్ప‌టికే ఈ ఫీట్ ని స్టార్ హీరోలు మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ చేశారు. `నాని` చిత్రంలో మ‌హేష్ బాబు, ఆంధ్రా వాలా, శ‌క్తి చిత్రాల్లో ఎన్టీఆర్‌, బాహుబ‌లి లో ప్ర‌భాస్ తండ్రీ కొడుకులుగా న‌టించిన ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ చేరుతుండ‌టం ఆస‌క్తిరేకెత్తిస్తోంది. భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ తో ప‌వ‌న్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో, చ‌ర‌ణ్ - శంక‌ర్ సినిమాతో ఎలాంటి ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.