Begin typing your search above and press return to search.

గోదావరి పై పొన్నియన్ సెల్వన్..!

By:  Tupaki Desk   |   22 Feb 2021 1:30 PM GMT
గోదావరి పై పొన్నియన్ సెల్వన్..!
X
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలంటే దేశవ్యాప్తంగా అభిమానులకు మంచి విందుభోజనం దొరికినట్లే. ఆయన మేకింగ్‌ను ఇష్టపడని వారుండరు. సినీతారల నుండి అభిమానుల వరకు అందరు మణిరత్నం సినిమాలకు దాసోహమే అంటారు. అయితే కొన్నేళ్లుగా ఆయన ఖాతాలో సరైన సక్సెస్ పడలేదు. చివరిగా రూపొందించిన నవాబ్ ఓ మోస్తరు విజయం సాధించినా ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రాన్ని మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఓ ఫేమస్ తమిళ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పొన్నియన్ సెల్వన్ అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాలో చాలామంది స్టార్లు నటిస్తున్నారు. సౌత్ నార్త్ అగ్ర నటులంతా అంటే.. ఐశ్వర్యరాయ్‌ తనను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేసిన మణిరత్నం ఈ సినిమాలో నటిస్తోంది.

పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, అతిథిరావు హైదరీ, అశ్విన్, జయరామ్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. లాక్ డౌన్ అనంతరం పాండిచ్చేరిలో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ గోదావరి నది తీరంలో జరుగుతుంది. గోదావరిలో పాపికొండల వరకు షూట్ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలవరం దగ్గర సింగన్నపల్లిలో టూరిజం బోట్లు, పడవలు, డెకొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. భారీ సెట్టింగ్స్ తో షూటింగ్ జరుపనున్నట్లు సమాచారం. మొత్తానికి మణిరత్నం ఈసారి పొన్నియన్ సెల్వన్ తో హిట్టు కొడతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.