Begin typing your search above and press return to search.
ట్రైలర్: సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా 'పీనట్ డైమండ్'
By: Tupaki Desk | 14 Jun 2021 11:32 AM GMTఅభినవ్ సర్ధార్ పటేల్ - రామ్ కార్తిక్ - చాందిని తమిళరసన్ - శాని సాల్మాన్ - శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ''పీనట్ డైమండ్''. త్రిపర్ణ వెంకటేష్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేశారు.
'త్రేతాయుగంలో మంచి చెడు అనేవి రామ రావణుడి రూపంలో ఒకే ప్రపంచంలో ఉండేవి.. ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల రూపంలో ఒకే కుటుంబంలో ఉంది' అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కలియుగంలో మంచికి చోటు లేదు, చెడుకి మాత్రమే చోటు ఉంది అనేలా చూపించారు. ట్రైలర్ చూస్తుంటే 30 ఏళ్ల గ్యాప్ లో రెండు వేర్వేరు కాలాలకు చెందిన కథలను సమాంతరంగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటుగా టైటిల్ కు తగ్గట్లు వజ్రాలపై పరిశోధన చేస్తున్నారనే కోణాన్ని చూపిస్తూ వచ్చారు. దర్శకుడు ఒక కొత్త కాన్సెప్ట్ ను ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది. ఇందులో సుమన్ - శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు కనిపిస్తున్నారు. దీనికి సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలానే 'బెంగాల్ టైగర్' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.
మొత్తం మీద 'పీనట్ డైమండ్' ట్రైలర్ ఆశాజనకంగా ఉండటంతో పాటుగా సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఎఎస్పి మీడియా హౌస్ మరియు జివి ఐడియాస్ పతకాలపై ఈ సినిమా రూపొందుతోంది. అభినవ్ సర్ధార్ - త్రిపర్ణ వెంకటేష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'త్రేతాయుగంలో మంచి చెడు అనేవి రామ రావణుడి రూపంలో ఒకే ప్రపంచంలో ఉండేవి.. ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల రూపంలో ఒకే కుటుంబంలో ఉంది' అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కలియుగంలో మంచికి చోటు లేదు, చెడుకి మాత్రమే చోటు ఉంది అనేలా చూపించారు. ట్రైలర్ చూస్తుంటే 30 ఏళ్ల గ్యాప్ లో రెండు వేర్వేరు కాలాలకు చెందిన కథలను సమాంతరంగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో పాటుగా టైటిల్ కు తగ్గట్లు వజ్రాలపై పరిశోధన చేస్తున్నారనే కోణాన్ని చూపిస్తూ వచ్చారు. దర్శకుడు ఒక కొత్త కాన్సెప్ట్ ను ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది. ఇందులో సుమన్ - శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటులు కనిపిస్తున్నారు. దీనికి సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలానే 'బెంగాల్ టైగర్' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.
మొత్తం మీద 'పీనట్ డైమండ్' ట్రైలర్ ఆశాజనకంగా ఉండటంతో పాటుగా సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఎఎస్పి మీడియా హౌస్ మరియు జివి ఐడియాస్ పతకాలపై ఈ సినిమా రూపొందుతోంది. అభినవ్ సర్ధార్ - త్రిపర్ణ వెంకటేష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.