Begin typing your search above and press return to search.

దాస్ ని దించి సీమ మాండ‌లీకంతో పాడిస్తారా?

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:31 AM GMT
దాస్ ని దించి సీమ మాండ‌లీకంతో పాడిస్తారా?
X
ఏడ పోయినాడో..! అంటూ అర‌వింద స‌మేత‌లో త‌న‌దైన విరుపుతో శ్రావ్య‌మైన ఆలాప‌న‌తో అల‌రించిన పెంచ‌ల్ దాస్ ని తెలుగు సినీప్రియులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆయ‌న స్వ‌రంలో ప్ర‌త్యేక‌త ఏనాడో తెలుగు ఆడియెన్ కి పిచ్చిగా న‌చ్చేసింది. కృష్ణార్జున యుద్ధం- చిత్ర‌ల‌హ‌రి చిత్రాల్లోనూ ఆయ‌న ఆల‌పించిన పాట‌లు బంపర్ హిట్ట‌య్యాయి. త‌దుప‌రి శ‌ర్వానంద్ న‌టిస్తున్న శ్రీ‌కారంలోనూ అత‌డు అద్భుత‌మైన గీతాన్ని ఆల‌పించారు.

పెంచ‌ల్ దాస్ త‌న‌దైన మార్క్ స్వ‌రాలాపాన‌తో రాయలసీమ నుండి వచ్చిన జానపద సంచలనంగా అంద‌రికీ సుప‌రిచితుడు. అందుకే ఇప్పుడు ఆయ‌న‌ను బ‌రిలో దించాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బృందం ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన పాటతో దాస్ అల‌రించ‌నున్నాడు.

పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి కలయికలో అయ్యప్పయం కోషియం రీమేక్ లో ఒక పాట‌ను ఆయ‌న ఆల‌పించ‌నున్నారు. పెంచల్ దాస్ పాడితే ఈ పాట తదుపరి స్థాయిలో ఉంటుందని చిత్ర‌బృందం భావిస్తోంది. సెకండ్ వేవ్ క్రైసిస్ నుంచి నెమ్మ‌దిగా బ‌య‌ట‌ప‌డుతున్నాం కాబ‌ట్టి ఇక‌పై షూటింగుల‌కు వెళ్లేందుకు హీరోలంతా సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే కొంద‌రు మొద‌లెట్టారు. ప‌వ‌న్ బృందం కూడా జూలై నుంచి సెట్స్ కెళ్లేందుకు యోచిస్తున్నార‌ని చెబుతున్నారు. ఈలోగానే పెంచ‌ల్ దాస్ తో పాట‌ను రికార్డింగ్ చేస్తారా లేదా అన్న‌ది చిత్ర‌బృందం అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది. మ‌ల‌యాళంలో బంప‌ర్ హిట్ కొట్టిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియం .. తెలుగు రీమేక్ లో ప‌వ‌న్ .. రానా పాత్ర‌లు వేటిక‌వే ప్ర‌త్యేకంగా ఉంటాయ‌ని చిత్ర‌బృందం చెబుతోంది.