Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న దిల్ రాజు

By:  Tupaki Desk   |   19 March 2020 5:53 AM GMT
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్న దిల్ రాజు
X
రెండేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ' వకీల్ సాబ్'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన 'పింక్' రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఓ మై ఫ్రెండ్' వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు కలిసి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ఒక పాట కూడా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా విశేష స్పందన లభించింది. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నటిస్తున్న ఈ చిత్రం మీద అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతూవుంది. వివరాల్లోకి వెళ్తే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తీసుకున్న నిర్ణయం పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చడం లేదంట.

అదేంటంటే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటింప చేయడానికి నటి లావణ్య త్రిపాఠితో దిల్ రాజు చర్చలు జరుపుతున్నారని సమాచారం. 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి జోష్ లో ఉన్న లావణ్య త్రిపాఠీని హీరోయిన్ గా తీసుకోవడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దిల్ రాజు సెలెక్టన్ పై మెగా అభిమానులు సంతోషంగా లేరని, ఈ విషయం కొందరు అభిమానులు స్వయంగా దిల్ రాజుని కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేసారని ఇండస్ట్రీ లో చర్చించుకుంటున్నారు. మరి ఇప్పుడు దిల్ రాజు లావణ్య విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ మంచి హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.