Begin typing your search above and press return to search.
దేవుడితో మెగా హీరో.. అదుర్స్ బ్రో
By: Tupaki Desk | 29 May 2023 11:15 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న చిత్రమే 'బ్రో (BRO)'. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయిన 'వినోదయ సీతమ్'కు ఇది రీమేక్గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రేజీ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి నటిస్తోన్న 'బ్రో (BRO)' మూవీ నుంచి వరుసగా అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. దీని నుంచి ఇప్పటికే పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ పాత్రలకు సంబంధించిన రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఉన్న మరో పోస్టర్ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఆదివారమే అనౌన్స్ చేసింది.
ముందుగా ప్రకటించినట్లుగానే సోమవారం (మే 29) ఉదయం 10:08 గంటలకు 'బ్రో (BRO)' మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమదైన స్టైల్తో దర్శనమిచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ బైక్ మీద కాలు వేసి ఎంతో గ్రేస్గా లుక్కిచ్చాడు.
అతడి వెనకాలే సుప్రీమ్ హీరో పద్దతిగా నిల్చుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా జూలై 28వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఇక, 'బ్రో (BRO)' సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడు (కాలుడు)గా నటిస్తున్నాడు. అలాగే, సాయి ధరమ్ తేజ్ సామాన్య యువకుడు మార్కండేయులు అలియాస్ మార్క్ పాత్రను చేస్తోన్నాడు. ఒకానొక సమయంలో చనిపోయి స్వర్గానికి వెళ్లిన మార్క్ను దేవుడైన కాలుడు మళ్లీ భూమి మీదకు పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ అని ముందే చెప్పుకున్నాం.
క్రేజీ కాంబినేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్కు సంబంధించి చాలా భాగాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆయన చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇందులోనే ఓ స్పెషల్ సాంగ్ను సైతం షూట్ చేస్తారని అంటున్నారు. ఇందులో శృతి లేదా దిశా ఉంటారని టాక్.
మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి నటిస్తోన్న 'బ్రో (BRO)' మూవీ నుంచి వరుసగా అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. దీని నుంచి ఇప్పటికే పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ పాత్రలకు సంబంధించిన రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఉన్న మరో పోస్టర్ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఆదివారమే అనౌన్స్ చేసింది.
ముందుగా ప్రకటించినట్లుగానే సోమవారం (మే 29) ఉదయం 10:08 గంటలకు 'బ్రో (BRO)' మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తమదైన స్టైల్తో దర్శనమిచ్చారు. ముఖ్యంగా పవర్ స్టార్ బైక్ మీద కాలు వేసి ఎంతో గ్రేస్గా లుక్కిచ్చాడు.
అతడి వెనకాలే సుప్రీమ్ హీరో పద్దతిగా నిల్చుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా జూలై 28వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఇక, 'బ్రో (BRO)' సినిమాలో పవన్ కల్యాణ్ దేవుడు (కాలుడు)గా నటిస్తున్నాడు. అలాగే, సాయి ధరమ్ తేజ్ సామాన్య యువకుడు మార్కండేయులు అలియాస్ మార్క్ పాత్రను చేస్తోన్నాడు. ఒకానొక సమయంలో చనిపోయి స్వర్గానికి వెళ్లిన మార్క్ను దేవుడైన కాలుడు మళ్లీ భూమి మీదకు పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ అని ముందే చెప్పుకున్నాం.
క్రేజీ కాంబినేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'బ్రో (BRO)' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్కు సంబంధించి చాలా భాగాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆయన చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇందులోనే ఓ స్పెషల్ సాంగ్ను సైతం షూట్ చేస్తారని అంటున్నారు. ఇందులో శృతి లేదా దిశా ఉంటారని టాక్.