Begin typing your search above and press return to search.

పవన్, దాసరి.. మధ్యలో రచ్చ..

By:  Tupaki Desk   |   23 Dec 2015 7:00 PM IST
పవన్, దాసరి.. మధ్యలో రచ్చ..
X
పవన్ కళ్యాణ్ - దాసరి నారాయణ రావుల టీం మధ్యలోకి.. రచ్చ డైరెక్టర్ సంపత్ నంది వచ్చాడన్నది ఆ టైటిల్ అర్ధం అన్న మాట. పవర్ స్టార్ తో దాసరి ఓ సినిమా చేస్తానని చెప్పి ఇప్పటికే 10 నెలలు కావస్తోంది. ఇప్పటివరకూ సెట్స్ పై ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ తప్ప.. నెక్ట్స్ పవన్ ఏం చేస్తాడనే విషయంపై క్లారిటీ లేదు. ఇప్పుడిప్పుడే ఒక్కో విషయం బయటపడుతోంది. పవన్ - దాసరిల వెంచర్ కన్ఫామ్ అయిందట. సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్ డీటైల్స్ ని అనౌన్స్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఈ మూవీకి రీసెంట్ గా రవితేజ బెంగాల్ టైగర్ మూవీలో పవన్ నామ జపం చేసిన.. సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడన్నది లేటెస్ట్ న్యూస్. ఎలాగూ ఈ మూవీకి స్టోరీ బోర్డ్ సంగతులు పవన్,. దాసరిలే చూసుకుంటారు కాబట్టి.. డైరెక్షన్ మాస్ డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్న సంపత్ నందిని తీసుకున్నారన్నది టాక్. అయితే.. ఈ వెంచర్ కి తడాఖా - గోపాలా గోపాలా చిత్రాలు తీసిన కిషోర్ పర్దాసానీ(డాలీ) డైరెక్షన్ చేస్తాడని ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం టెర్మ్స్ మారిపోయాయనే చెప్పాలి. దర్శకుడిగా ఇప్పటికే ప్రూవ్ చేసేసుకున్నాడు. పవన్ పై అంతులేని అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసేందుకు ఇంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏం కావాలి చెప్పండి.

అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటుంది. ముందు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి కూడా సంపత్ నందినే డైరెక్టర్ అన్నారు. రెండేళ్ల పాటు వర్క్ చేశాక.. అప్పుడు బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. మరిప్పుడు మరోసారి పవన్ తో కలిసి ట్రావెల్ చేసే రిస్క్ చేస్తాడా.. లేక పవన్ తో ఇంత త్వరగా మరో ఛాన్స్ వచ్చినందుకు సంతోషిస్తాడా.. దీనికైతే సంపత్ నంది ఒక్కడే ఆన్సర్ చెప్పగలడు.