Begin typing your search above and press return to search.

మళ్ళీ మొదటికివచ్చిన పరశురామ్ వ్యవహారం!

By:  Tupaki Desk   |   3 July 2019 11:00 PM IST
మళ్ళీ మొదటికివచ్చిన పరశురామ్ వ్యవహారం!
X
'గీత గోవిందం' రిలీజై ఇప్పటికి దాదాపు ఏడాది అయింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ అయ్యాడు. రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారింది. దర్శకుడు పరశురామ్ కు డిమాండ్ పెరిగిందని అన్నారు కానీ ఇంతవరకూ నెక్స్ట్ సినిమా సెట్ కాలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబు సినిమా సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ ట్రయల్స్ వర్క్ అవుట్ కాలేదని టాక్.

పరశురామ్ రెడీ చేసిన కథ అల్లు అరవింద్ కు నచ్చలేదని.. అందుకే ఆ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు అడుగులు పడలేదని సమాచారం. ఇదిలా ఉంటే మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. దీంతో మహేష్ సినిమా ఛాన్స్ పరశురామ్ కు ఇప్పట్లో దొరికేలా లేదు. అందుకే పరశురామ్ తన నెక్స్ట్ సినిమాకు మరోసారి విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నాడట. పరశురామ్ నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ లో కాకుండా వేరే బ్యానర్ లో ఉంటుందట.

అయితే విజయ్ దేవరకొండ కాల్ షీట్స్ దొరకడం ఇప్పుడు కష్టమైన పనే. 'డియర్ కామ్రేడ్' కాకుండా విజయ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందట. అలాంటప్పుడు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మరో ఏడాది పాటు పరశురామ్ తన ఛాన్స్ కోసం వేచి చూడక తప్పేలా లేదు. బ్లాక్ బస్టర్ సినిమా దర్శకుడు ఇలా తన నెక్స్ట్ సినిమా కోసం వేచి చూడాల్సి రావడం నిరాశకు గురి చేసే అంశమే.