Begin typing your search above and press return to search.

రష్మికను అలా పరుశురామ్‌ చాలా ఏడిపించాడట!

By:  Tupaki Desk   |   7 Oct 2018 4:20 PM IST
రష్మికను అలా పరుశురామ్‌ చాలా ఏడిపించాడట!
X
ఈమద్య కాలంలో ‘బాహుబలి’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశం అయిన చిత్రాల్లో ‘గీత గోవిందం’ ఒకటని చెప్పుకోవచ్చు. విజయ్‌ దేవరకొండ - రష్మిక జంటగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ కు పైగా వసూళ్లు చేసిన ఈ చిత్రంతో విజయ్‌ దేవరకొండ మరియు రష్మిక మందనలు స్టార్స్‌ అయ్యారు. వీరిద్దరు కూడా ప్రస్తుతం పలు చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా రష్మిక ఈ గీత గోవిందం చిత్రం షూటింగ్‌ సమయంలో జరిగిన ఒక సంఘటనను మీడియా ముందుకు తీసుకు వచ్చింది.

షూటింగ్‌ లో అయినా ఎక్కడైనా కూడా తన చుట్టు ఉన్న వారు అంతా కూడా నాతో సరదాగా ఉండాలి - అలా లేకుంటే నాకు చెడ్డ చిరాకు వచ్చేస్తుంది. నాతో మాట్లాడకుండా ఎవరైనా ఉంటే మాత్రం నాకు ఏడుపు వచేస్తుంది. ‘గీత గోవిందం’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఒక రోజు నేను షూటింగ్‌ కు ఆలస్యంగా వచ్చాను. ఆ సమయంలో అంతా కూడా చాలా సీరియస్‌ గా ఉన్నారు. నేను మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. నేను లేటుగా వచ్చినందుకు శిక్ష అయ్యి ఉంటుందని నాకు ఏడుపు వచ్చింది.

షూటింగ్‌ స్పాట్‌ లోనే ఒక పక్కకు వెళ్లి కూర్చుని గట్టిగా ఏడ్చేశాను. తన ఏడుపు విని వెంటనే దర్శకుడు పరుశురామ్‌ నా వద్దకు వచ్చి ఇదంతా సరదాగా చేశామని, నీ వెనుక నీ ఫీలింగ్స్‌ ను షూట్‌ చేసేందుకు ఒక కెమెరా కూడా ఉంది చూడు అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో తాను రిలాక్స్‌ అయ్యానని - గీత గోవిందం షూటింగ్‌ సమయంలో ఇంకా ఎన్నో సరదా సంఘటనలు జరిగాయి అంది.