Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా పొలిటిక్ థ్రిల్ల‌ర్

By:  Tupaki Desk   |   19 July 2022 9:30 AM GMT
పాన్ ఇండియా పొలిటిక్ థ్రిల్ల‌ర్
X
దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. సామాన్యుడి గోడు విన‌డం కంటే ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ని నిర్వీర్యం చేయ‌డ‌మే ప్ర‌ధాన అజెండ‌గా పెట్టుకుని అధికార పార్టీలు పావులు క‌దుపుతున్న రోజులు ఇవి. ఈ నేప‌థ్యంలో స‌మ‌కాలీన రాజకీయాంశాల తో రూపొందుతున్న పాన్ ఇండియా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ 'శాస‌న స‌భ‌'. ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో హీరోగా ఇంద్ర‌సేన, హీరోయిన్ గా ఐశ్వ‌ర్య‌రాజ్ న‌టిస్తున్నారు. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో డా. రాజేంద్ర ప్ర‌సాద్‌, సోనియా అగ‌ర్వాల్‌, హెబ్బా ప‌టేల్, పృథ్వీరాజ్ న‌టిస్తున్నారు.

తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ మూవీని వేణు మ‌డికంటి తెర‌కెక్కిస్తున్నారు. సాబ్రో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సప్పాని బ్ర‌ద‌ర్స్ నిర్మిస్తున్నారు. స‌ప్పాని బ్ర‌ద‌ర్స్ గా పాపులర్ అయిన తుల‌సీరామ్ స‌ప్పాని, ష‌ణ్ముగం స‌ప్పాని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ మూవీ మోష‌న్ పోస్ట‌ర్ ని తాజాగా హైద‌రాబాద్ లో స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి విడుద‌ల చేశారు. మూడున్న‌ర ద‌శాబ్దాలుగా జ‌ర్న‌లిస్ట్ గా, పీఆర్వోగా టాలీవుడ్ లో సేల‌వందిస్తున్న రాఘ‌వేంద్ర‌రెడ్ది ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ కు క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు.

స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాలని ప్ర‌ధాన క‌థ‌గా ఎంచుకుని అంతంత ప‌వ‌ర్ ఫుల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో హీరోగా నిల‌బ‌డాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఇంద్ర‌సేన ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. రాఘ‌వేంద్ర‌రెడ్డి మంచి ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ని అందించాడ‌ని, నా కోస‌మే ఈ క‌థ‌ని అందించిన ఆయ‌న‌కు జీవితాంతం రుణ‌ప‌డి వుంటాన‌ని ఇంద్ర‌సేన ఈ సంద‌ర్భంగా తెలిపారు.

కేజీఎఫ్ సిరీస్ చిత్రాల‌తో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ కావ‌డమే కాకుండా ఆ సినిమాల‌కు త‌నదైన నేప‌థ్య సంగీతంతో వ‌న్ ఆఫ్ ద పిల్ల‌ర్ గా నిలిచిన పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌వి బాస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

తెలుగులో ఇదే ఆయ‌న తొలి చిత్రం కావ‌డం విశేషం. దేశ వ్యాప్తంగా ఆక‌ట్టుకునే క‌థ కావ‌డంతో ఈ మూవీని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల‌లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని చిత్ర బృందం ప్ర‌క‌టించ నుంద‌ని తెలిసింది.