Begin typing your search above and press return to search.

శాకుంతలంకు పాన్‌ ఇండియా అప్పీల్‌

By:  Tupaki Desk   |   8 Aug 2021 7:52 AM GMT
శాకుంతలంకు పాన్‌ ఇండియా అప్పీల్‌
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత హీరోయిన్ గా గుణ శేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రను మలయాళ నటుడు దేవ్‌ మోహన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలో భరత రాకుమారుడి పాత్రలో అల్లు వారి ప్రిన్సెస్‌ అర్హాను ఎంపిక చేయడం జరిగింది. ఇటీవలే అల్లు అర్హ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో మోహన్‌ బాబు కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా ను బాలీవుడ్‌ లో కూడా విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా రేంజ్ లో విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు కబీర్ బేడీ నటించబోతున్నాడు. బాలీవుడ్‌ లో సీనియర్‌ నటుడిగా గుర్తింపు దక్కించుకుని సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్న ఈయన శాకుంతలం సినిమాలో నటిస్తున్న విషయమై అధికారిక ప్రకటన రాలేదు. కాని తాజాగా సినిమా నిర్మాత అయిన నీలిమ గుణ సోషల్‌ మీడియాలో కబీర్‌ బేడీ వంటి స్టార్‌ తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఆమె ట్వీట్‌ తో శాకుంతలం సినిమాలో ఆమె ఉంటుంది అంటూ నెటిజన్స్‌ కు క్లారిటీ వచ్చింది.

గుణశేఖర్‌ గత చిత్రం రుద్రమదేవి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు గుణశేఖర్‌ తదుపరి సినిమాను చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్‌ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతున్నాడు. సౌత్‌ ఇండియాలో మంచి గుర్తింపు ఉన్న సమంతకు ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ తో ఉత్తరాదిన కూడా మంచి విజయం దక్కింది. దాంతో ఈ సినిమాకు ఉత్తరాదిన కూడా మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట సందడి చేస్తున్న శాకుంతలం సినిమా షూటింగ్‌ ను ఇదే ఏడాదిలో ముగించేయాలనే పట్టుదలతో దర్శకుడు గుణశేఖర్ ఉన్నారు.

సమంత తో పాటు మోహన్ బాబు ఇంకా పలువురు ప్రముఖులు ఈ సినిమాలో నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా గుణశేఖర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. పురాణాల్లో శాకుంతలం అనేది చాలా ప్రత్యేకమైన అంకం. అందుకే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను సరైన సమయం చూసి విడుదల చేయాలని గుణశేఖర్ ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమా కు దిల్‌ రాజు నిర్మాణ సహకారం అందిస్తున్నాడు. ఆయన ఈ ప్రాజెక్ట్‌ లో భాగస్వామ్యం అవ్వడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు.